POK Protests: కొద్దిరోజులుగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజలు రోడ్లమీదకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. ధరల పెరుగుదల విపరీతంగా ఉందని.. నిత్యావసరాలు అందకుండా చేస్తున్నారని.. పాకిస్తాన్ ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో అక్కడి ప్రజలు మండిపడ్డారు.. పాకిస్తాన్ తీరును ఎండగడుతూ అక్కడి ప్రజలు నిరసనలు మొదలుపెట్టారు. శాంతియుతంగా ధర్నాలు చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకొని.. వాటి పరిష్కారానికి అడుగులు వేయాల్సిన పాకిస్థాన్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. చివరికి ఆర్మీని రంగంలోకి దింపింది.
పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్మీని రంగంలో దింపిన నేపథ్యంలో అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అత్యంత హింసాత్మకంగా మారింది. పాకిస్తాన్ ఆర్మీ కనీసం విచక్షణ లేకుండా చిన్న పిల్లలను.. గర్భిణులను కాల్చి చంపింది. ఈ ఘటన పట్ల అక్కడి ప్రజల్లో మరింత ఆగ్రహం పెరిగే.. మరింత తీవ్రంగా నిరసనలు చేపట్టారు. అంతర్జాతీయంగా కూడా ఒత్తిడి రావడంతో పాకిస్తాన్ తన సైన్యాన్ని వెనక్కి పంపింది.
పాకిస్తాన్ ఆర్మీ వ్యవహరిస్తున్న తీరు పట్ల లండన్ లో కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. శాంతియుత చర్చలకు బదులుగా పాకిస్తాన్ ప్రభుత్వం మిలిటరీని రంగంలోకి దింపి కాల్పులు జరపడం పట్ల.. ప్రజలను అరెస్టు చేయడం పట్ల అంతర్జాతీయంగా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. దీనికి తోడు అక్కడి ప్రజల్లో ఉద్యమ బీజాలు నాటిన జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ని ఉగ్రవాద సంస్థగా పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. అదే కాదు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ కు మందులు.. ఆహారం.. కూరగాయలు.. పాఠ్యపుస్తకాల సరఫరాను నిలిపివేసింది. దీంతో అక్కడ ప్రజలు తీవ్రస్థాయిలో ఇబ్బంది పడుతున్నారు.. అయితే ఈ దమనకాండను బయట ప్రపంచానికి తెలియకుండా పాకిస్తాన్ నాటకాలు ఆడింది. నిజాలను కప్పి పుచ్చింది.
పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు పట్ల ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ ప్రతినిధులు ఇక్కడికి రావాలని.. వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయాలని పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీనికి తోడు లండన్ ప్రాంతంలో కూడా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విదేశాలలో స్థిరపడిన మీర్ పూరి ముస్లింలు కూడా పాకిస్తాన్ చర్యలను నిరసిస్తున్నారు. లండన్ లో భారీగా నిరసనలు చేపడుతున్నారు. ఫలితంగా పాకిస్థాన్ అసలు రంగు అంతర్జాతీయ వేదికల్లోకి ఎక్కింది. పాకిస్తాన్ అసలు రంగు బయటపడుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వ వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపడుతూ అక్కడి ప్రజలు నిరసన చేపట్టడం.. తిరుగుబాటు చేయడం భవిష్యత్ కాలంలో చోటుచేసుకునే పరిణామాలకు బలమైన సంకేతంగా నిలుస్తోంది.
