మళ్లీ హోస్ట్‌గా ఎన్టీఆర్.. రెమ్యునరేషన్‌ ఎంతంటే !

“బిగ్ బాస్” అనే రియాలిటీ షో అసలు తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయింది అంటే.. దానికి కారణం ఎన్టీఆరే. మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించి ఆ కాన్సెప్ట్ సామాన్య జనాల్లోకి బాగా చొచ్చుకుపోయేలా చాల ఉపయోగపడ్డాడు. తన ఛరిస్మా, వాగ్దాటి చాతుర్యంతో ఎన్టీఆర్ బెస్ట్ హోస్ట్ గా నిలిచాడు. కానీ, తర్వాతి సీజన్లకి హోస్ట్ గా చేసేందుకు ఎన్టీఆర్ అంగీకరించకపోవడంతో రెండో సీజన్ కి నానిని, ఆ తర్వాత వరుసగా నాగార్జునను హోస్ట్ […]

Written By: admin, Updated On : December 12, 2020 5:18 pm
Follow us on


“బిగ్ బాస్” అనే రియాలిటీ షో అసలు తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయింది అంటే.. దానికి కారణం ఎన్టీఆరే. మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించి ఆ కాన్సెప్ట్ సామాన్య జనాల్లోకి బాగా చొచ్చుకుపోయేలా చాల ఉపయోగపడ్డాడు. తన ఛరిస్మా, వాగ్దాటి చాతుర్యంతో ఎన్టీఆర్ బెస్ట్ హోస్ట్ గా నిలిచాడు. కానీ, తర్వాతి సీజన్లకి హోస్ట్ గా చేసేందుకు ఎన్టీఆర్ అంగీకరించకపోవడంతో రెండో సీజన్ కి నానిని, ఆ తర్వాత వరుసగా నాగార్జునను హోస్ట్ గా తీసుకున్నారు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ అనగానే నాగార్జున అన్నట్లుగా మారిపోయింది.

Also Read: ఏడిస్తే ఓట్లు వేస్తారా..? డ్రామాలు చేస్తే ఆదరిస్తారా..?

అంటే ఎన్టీఆర్ మొదలుపెట్టిన దాన్ని నాగార్జున పూర్తిగా తన షోగా మార్చుకున్నాడు అన్నమాట. అయితే ఇప్పుడు నాగార్జున మొదలుపెట్టిన షోని ఎన్టీఆర్ టేకప్ చేస్తున్నాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. జెమినీ టీవీ లేటెస్ట్ గా “కౌన్ బనేగా కరోడ్పతి” కార్యక్రమాన్ని తెలుగులో ప్రసారం చేసేందుకు అంతా సిద్ధం అయిన సంగతి తెలిసిందే. తెలుగులో ఈ షోని ఇంతకుముందు మాటీవీ “మీలో ఎవరు కోటీశ్వరుడు” పేరుతో కొన్ని సీజన్లు ప్రసారం చేసారు. దానికి హోస్ట్ గా నాగార్జున వ్యవహరించారు కూడా.

Also Read: అమ్మాయి మోసం చేసింది.. బెస్ట్ కమెడియన్ అయిపోయాడు !

ఇప్పుడు ఇదే షోను జెమినీ టీవీ రివైవ్ చేస్తోందని.. హోస్ట్ గా ఎన్టీఆర్ ని ఒప్పించిందని.. ఎన్టీఆర్ హోస్ట్ గా చేయడానికి దాదాపు ముప్పై కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. అయితే ఈ షోకి దాదాపు 45 రోజులు డేట్స్ కేటాయించాడట. మొత్తానికి నాగార్జున మొదలుపెట్టిన దాన్ని ఎన్టీఆర్ టేకప్ చేస్తున్నాడు. ప్లాన్ చేసి ఇద్దరూ రెండు టీవీ షోలని మార్చుకోకపోయినా ఇది చాల ఆసక్తిగా ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్