Homeఎంటర్టైన్మెంట్Jabardasth completes 700 episodes : 700 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న జబర్దస్త్..సంబరాల్లో పాల్గొన్న నాగబాబు..రోజా...

Jabardasth completes 700 episodes : 700 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న జబర్దస్త్..సంబరాల్లో పాల్గొన్న నాగబాబు..రోజా ఏమైంది?

Jabardasth completes 700 episodes: ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్(Jabardasth Comedy Show) అనే కామెడీ షో ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు బుల్లితెర హిస్టరీ లోనే జబర్దస్త్ ఒక చరిత్ర. ఈ షో ని ప్రేరణగా తీసుకొని ఇతర టీవీ చానెల్స్ లో కూడా ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోస్ వచ్చాయి, ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. అలాంటి సెన్సేషనల్ కామెడీ షో ప్రారంభమై 12 ఏళ్ళు అయ్యింది. ప్రతీ వారం గురు, శుక్రవారాల్లో టెలికాస్ట్ అయ్యే ఈ బిగ్గెస్ట్ కామెడీ షో, ప్రస్తుతం శుక్ర, శనివారాల్లో టెలికాస్ట్ అవుతుంది. ఈ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ మన టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను,చమ్మక్ చంద్ర, షకలక శంకర్, ఇలా ఒక్కరా ఇద్దరా ఎంతో మంది కమెడియన్స్ ఈ షో ద్వారానే పుట్టుకొచ్చారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ 1 కమెడియన్ గా కొనసాగుతున్న సత్య కూడా ఈ కామెడీ షో ద్వారా వచ్చిన వాడే. ఈ షో అంతటి విజయం సాధించడానికి ప్రధాన కారణాలలో నాగబాబు(Nagababu Konidela), రోజా(Roja Selvamani) ఒకరు. వీళ్లిద్దరు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి షో కి ఒక హుందాతనాన్ని తీసుకొచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో నాగబాబు కి ఈ షో అద్బుతమగా కలిసొచ్చింది. ఇక రోజా కి కూడా కెరీర్ పరంగా ఈ షో ఒక గేమ్ చేంజర్ అనే చెప్పాలి. పాన్ ఇండియా లెవెల్ లో ఇప్పుడు ఆర్టిస్ట్ గా రాణిస్తున్న అనసూయ కూడా ఈ షో ద్వారానే పరిచయం అయ్యింది. అదే విధంగా యాంకర్ రష్మీ కి కూడా ఈ షో ద్వారా కెరీర్ వచ్చింది. ఇప్పటికీ ఆమె ఈ షోకి యాంకర్ గా వ్యవహరిస్తూనే ఉంది.

Also Read: కింగ్డమ్’ మరోసారి వాయిదా పడబోతోందా..? కారణాలు చూస్తే ఆశ్చర్యపోతారు!

12 ఏళ్లుగా 700 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈటీవీ వారు జబర్దస్త్ గ్రాండ్ సెలబ్రేషన్స్ ని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కి నాగబాబు విచ్చేశాడు. ఇప్పటి వరకు జబర్దస్త్ లో కొనసాగిన కమెడియన్స్ అందరూ హాజరు అయ్యారు. ప్రస్తుతం కొనసాగుతున్న వాళ్ళు, సినిమాలో బిజీ అయ్యి ప్రస్తుతానికి ఈ షోలో కొనసాగని వాళ్ళు కూడా ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. అయితే సుడిగాలి సుధీర్ ఈ ఈవెంట్ కి రాకపోవడం గమనార్హం. అంతే కాకుండా రోజా కూడా ఈ ఈవెంట్ లో మిస్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. రోజా ఎందుకు రాలేదు?, నాగబాబు ఉన్నాడని రాలేదా?, ఈ ఇరువురు ఇప్పుడు వేర్వేరు పార్టీలలో ఉన్నారు, వీళ్ళ మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈటీవీ వారు ఆమెని ఆహ్వానించలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ ఈవెంట్ కి సంబంధించిన ప్రోమో ని క్రింద అందిస్తున్నాము,చూసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
RELATED ARTICLES

Most Popular