Homeఎంటర్టైన్మెంట్Ram Charan : రాంచరణ్ ఇంట క్రిస్మస్ పండుగ.. చుట్టూ ఏమున్నాయో తెలుసా? ఇంత ప్రేమ...

Ram Charan : రాంచరణ్ ఇంట క్రిస్మస్ పండుగ.. చుట్టూ ఏమున్నాయో తెలుసా? ఇంత ప్రేమ ఏంటి స్వామి

Ram Charan : క్రిస్మస్ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు మొదలయ్యాయి. క్రైస్తవులకు క్రిస్మస్ చాలా ముఖ్యమైన పండుగ. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత విస్తృతంగా జరుపుకునే పండుగలలో క్రిస్మస్ ఒకటి. క్రిస్మస్ సందర్భంగా, క్రైస్తవులు తమ ఇళ్ల ముందు నక్షత్రాలను వేలాడదీయడం, క్రిస్మస్ ట్రీలను ఉంచడం, వాటిని లైట్లతో అందంగా అలంకరించడం చూస్తుంటాం. ఈ క్రిస్మస్ చెట్టుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో క్రిస్మస్ చెట్టును ఉంచడం చాలా మంచిది, ఇది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిని తెస్తుంది. దీనివల్ల ఇంటికి ఆనందం, శాంతి కలుగుతాయి. క్రిస్మస్ చెట్టును ఇంట్లో ఉంచడం వల్ల ఇంటి వాస్తు దోషం తొలగిపోతుందని చెబుతారు. క్రిస్మస్ చెట్టు ఐక్యతకు చిహ్నంగా పరిగణించబడుతుంది. కుటుంబ సభ్యులు కలిసి ఇంటిని అలంకరించుకుంటే కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి సమస్యలు ఉండవని నమ్ముతారు.

మరోవైపు టాలీవుడ్ సెలబ్రిటీల ఇళ్లలో కూడా క్రిస్మస్ పండగ వాతావరణం నెలకొంది. డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ సందర్భంగా రామ్ చరణ్ ఇంట్లో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ ఫోటోలను రామ్ చరణ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఇందులో తన భార్య ఉపాసన కూడా ఉన్నారు. వారితో పాటు వారు పెంచుకునే కొన్ని కుక్కలు కూడా ఉన్నాయి. వాస్తవానికి ఉపాసనకు మూగ జీవాలంటే ఎంతో ప్రేమ. అలాగే రామ్ చరణ్ కు కూడా. వాటి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు మెగా పవర్ స్టార్ దంపతులు. ఇప్పుడు వాటితోనే క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకుంటున్నారు. ప్రతి సంవత్సరం టాలీవుడ్ లోని సెలబ్రిటీలతో కలిసి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారు మెగాస్టార్ ఫ్యామిలీ మెంబర్స్. మరి ఈ సారి రామ్ చరణ్ దంపతులు ఒక్కరే కనిపించారు.

గతేడాది క్రిస్మస్ వేడుకల్లో మెగా హీరోలంతా కనిపించారు. నిహారిక నుంచి మొదలుకుని కొత్త జంట అయిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు కూడా ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. అల్లు శిరీష్, అల్లు బాబీ, అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ఇలా అందరూ కలిసి క్రిస్మస్‌ను బాగానే సెలెబ్రేట్ చేసుకున్నారు. అప్పుడు అందరి కంటే ఎక్కువగా రామ్ చరణ్, అల్లు అర్జున్‌లే హైలెట్ అయ్యారు. ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుని పోజులు ఇవ్వడంతో ఈ ఫోటో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ ఫోటోలను ఇటు బన్నీ ఫ్యాన్స్, అటు చరణ్ ఫ్యాన్స్ అప్పుడు తెగ షేర్ చేశారు. మరి ఈ సారి అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వివాదంలో చిక్కుకున్నారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి కాస్త దూరంగా కూడా పెరిగిందని ప్రచారం జరుగుతుంది. దీంతో రెండు ఫ్యామిలీలు కలిసి పండుగలు సెలబ్రేట్ చేసుకోవడం డౌటే.

ఇక రామ్ చరణ్.. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ డల్లాస్ లో అట్టహాసంగా జరిగింది. సంక్రాంతి కానుకగా వచ్చే నెల 10వ తేదీన సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. వీరితో పాటు అంజలి, సముద్రఖని, ఎస్‌జె సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ గత చిత్రం ‘ఆచార్య’ డిజాస్టర్ కావడంతో , ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో రామ్ చరణ్ బాక్సాఫీస్ లెక్కలన్నీ కూడా మార్చేస్తాడని మెగా అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by RamCharan.k (@ramcharankonidella.k)

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper