Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తతం చేస్తోన్న క్రేజీ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కరోనా సోకి అలా 10 రోజులు ఐసొలేషన్ లో ఉన్న చిరంజీవి, కరోనా పరీక్షల్లో నెగెటివ్ అని తేలిన తర్వాత బయటకు వచ్చారు. నేరుగా గాడ్ ఫాదర్ షూటింగ్ లొకేషన్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆన్-లొకేషన్ స్టిల్స్ కూడా షేర్ చేశారు. పైగా ఐయామ్ బ్యాక్ అంటూ మెగాస్టార్ యాక్షన్ లో దిగారు. ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ టీం షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోల ద్వారా సినిమా స్టోరీ ఇదే అంటూ కొందరు కథ చెప్పేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఫోటోల ద్వారా గాడ్ ఫాదర్ సినిమాలో చిరు లుక్ ఎలా ఉంటుందో రివీల్ అయిపోయింది. పైగా ఫోటోల్లో ఒక రాజకీయ పార్టీ కూడా బాగా హైలైట్ అయ్యింది. ‘జన జాగృతి’ అనే పార్టీని స్థాపించినట్లు ఆ పార్టీ బాగు కోసం చిరంజీవి కృషి చేస్తున్నట్లు.. ఈ క్రమంలో వచ్చే సీన్స్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయని తెలుస్తోంది.
Also Read: ఆస్పత్రి పాలైన జయసుధ.. ఆందోళనలో అభిమానులు
అయితే, ‘జన జాగృతి’ పార్టీ రంగు, జనసేన పార్టీ రంగుకి దగ్గరగా ఉంది. పైగా.. జనసేన – ‘జన జాగృతి’ రెండు పదాలు కూడా దగ్గరగా ఉన్నాయి. కాబట్టి.. పవన్ కళ్యాణ్ పార్టీని గుర్తుకు తెచ్చేలా చిరు తన సినిమాలో పార్టీ పేరు పెట్టడం విశేషం. పైగా ఈ సినిమాలో తనకు సీఎం అయ్యే స్టామినా ఉన్నప్పటికీ తన తమ్ముడిని సీఎంను చేస్తాడు. సో.. చిరు- పవన్ కథకు కూడా ఇది బాగా దగ్గరగా ఉంది. మొత్తానికి జనసేన పార్టీ కోసం చిరు ఇన్ డైరెక్ట్ గా పని చేస్తున్నాడని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చిరు గాడ్ ఫాదర్ సినిమా కూడా పవన్ కోసమే చేస్తున్నాడట.
పైగా సినిమాలో మంచి ఎమోషన్స్ ను కూడా యాడ్ చేశారని.. మెగాస్టార్ కి, మెగాస్టార్ తండ్రి పాత్రకు మధ్య బలమైన ఎమోషనల్ సీన్స్ ఉంటాయట. ఇక మెగాస్టార్ ఫాదర్ గా సీనియర్ నటుడు విజయ్ చందర్ నటించబోతున్న సంగతి తెలిసిందే. అంటే సీఎం పాత్రలో విజయ్ చందర్ కనిపించబోతున్నాడు అన్నమాట. ఈ పాత్ర చనిపోయాకే మెగాస్టార్ హీరోయిజమ్ ఎలివేట్ అవుతుంది. నిజానికి మెగాస్టార్ చేస్తున్న సినిమాల్లోనే ఫుల్ క్రేజ్ ఉన్న సినిమా కావడంతో ఈ చిత్రం పై చిరు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అందులో భాగంగానే చిరు లుక్స్ ను పూర్తిగా మార్చబోతున్నాడు. పంచె కట్టుతో వైట్ అండ్ వైట్ డ్రెస్ లో చిరు పక్కా క్లాసిక్ మాస్ లుక్ లో దర్శనం ఇవ్వబోతున్నాడు. అలాగే, పక్కా హీరోయిజమ్ తో సాగే సినిమా ఇది, అందుకే ఫ్యాన్స్ కూడా ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాలోని కీలకమైన యాక్షన్ సీన్స్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. మొత్తానికి బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు అవ్వడం ఖాయం. కాగా కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్వీఆర్ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.
Also Read: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలుపెవరిది?

[…] Also Read: జనసేన కోసం చిరంజీవి పని చేస్తున్నాడా… […]