Chatrapathi: అల్లుడు శ్రీను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై యంగ్ ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచుకున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అయితే, ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా హిట్ కొట్టలేకపోయాయి. అయితే, ప్రస్తుతం బాలీవుడ్లో తన లక్ను పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు శ్రీనివాస్. ఛత్రపతి రీమేక్తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. వివి వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ చాలా ఫాస్ట్గా సాగుతోంది. ఈ సినిమా తర్వాత స్టువర్టుపురం దొంగ సినిమాను పట్టాలెక్కించనున్నారు శ్రీనివాస్.

కాగా, ఈ మూవీలో ప్రముఖ హిందీ హాస్య నటుడు జానీ లివర్ ఛత్రపతి రీమేక్లో నటిస్తున్నారు. ఈ విషయాన్ని హీరో బెల్లం కొండ శ్రీనివాస్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ క్రమంలోనే జానీ లివర్తో ఉన్న ఫొటోలను పోస్ట్ చేస్తూ.. లెజండరీ యాక్టర్ నాజీ లివర్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకనే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. సెట్లో జానీ లివర్ ఉంటే..ఇక అందరూ ఎనర్జిటిక్గా ఉంటారని శ్రీనివాస్ పేర్కొన్నారు. అయితే, తెలుగు నేలపై పుట్టి ముంబయిలో స్థిరపడ్డ జానీ.. ఇప్పటికీ చక్కగా తెలుగు మాట్లాడగరు.
కాగా, జైజానకి నాయక, సీత సినిమాలు పెద్దగా హిట్ సాధించలేకపోయాయి. ఆ తర్వాత వచ్చిన రాక్షసుడు సినిమా ప్రేక్షకులను అలరించింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగిన ఈ సినిమా అందరినీ కట్టిపడేసింది. ఇటీవలే వచ్చిన అల్లుడు అదుర్స్ కూడా ఎప్పటిలాగే ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు బాలీవుడ్లో అయినా విజయం సాధిస్తాడేమో వేచి చూడాలి.