ఫ్యాన్స్ కోసం చేస్తానంటున్న మాజీ హీరోయిన్ !

టాలీవుడ్ లో పదేళ్ల క్రితం ఛార్మి తన గ్లామర్ తో హీరోయిన్ గా ఒక ఊపు ఊపింది. ‘నీతోడు కావాలి’ అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంటరైన ఈ మాజీ బ్యూటీ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా నటించి బాగానే పాపులారిటీని తెచ్చుకుంది. దీనికితోడు బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో ‘బుడ్డా హోగా తేరే బాప్.. అంటూ ఛార్మి హిందీలో కూడా ఒక వెలుగు వెలగటానికి ప్రయత్నించింది. […]

Written By: admin, Updated On : October 5, 2020 5:12 pm
Follow us on


టాలీవుడ్ లో పదేళ్ల క్రితం ఛార్మి తన గ్లామర్ తో హీరోయిన్ గా ఒక ఊపు ఊపింది. ‘నీతోడు కావాలి’ అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంటరైన ఈ మాజీ బ్యూటీ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా నటించి బాగానే పాపులారిటీని తెచ్చుకుంది. దీనికితోడు బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో ‘బుడ్డా హోగా తేరే బాప్.. అంటూ ఛార్మి హిందీలో కూడా ఒక వెలుగు వెలగటానికి ప్రయత్నించింది. కాకపోతే అక్కడ వర్కౌట్ అవలేదు అనుకోండి. ఆ తరువాత డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో ‘జ్యోతిలక్ష్మి’ అంటూ టాలీవుడ్ లో నిర్మాతగానూ మారింది.

Also Read: సినిమాలను వదలనంటున్న ‘బొమ్మాళీ’..!

అయితే ఆ సినిమా తర్వాత ఛార్మి ఎందుకు సినిమాలు మానేసిందా అని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో అడగగా.. దాదాపు హీరోయిన్ గా 15 సంవత్సరాల నుండి అన్ని ప్రధాన భాషల్లో నటించాను. ఇంకా మళ్ళీ స్క్రీన్ మీదే కనిపించే ఉద్దేశ్యం లేదు, బోర్ కొట్టేసింది అని చెప్పుకొస్తూనే పూరితో కలిసి సినిమాలు తీస్తా అని స్పష్టంగా చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా.. ఇప్పటికీ తరగని తన అందంతో ఛార్మి ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటూ.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోస్ తో సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తూనే ఉంది.

Also Read: చరణ్ పై షూట్.. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ పరిస్థితి ?

పైగా ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో టచ్ లోనే ఉంది. కాగా తాజాగా కొంతమంది నెటిజన్లు ఛార్మితో ‘మళ్ళీ మిమ్మలిని హీరోయిన్ గా చూడాలనుకుంటున్నాము. మా కోసం ఒక్క సినిమానైనా చేయండి’ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అందుకే తన అభిమానుల కోసమైన ఒక్క సినిమా చేస్తే బావుంటుందని.. నా కోసం ఒక కొత్త కథను రెడీ చేయి అని పూరిని అడుగుతుందట. ఎలాగూ లాక్ డౌన్ లో పూరి నాలుగు కథలు సిద్దం చేశాడు. మరి వాటిల్లో ఒకటి వెబ్ సిరీస్ కూడా ఉందట. అది లేడీ ఓరియెంటెడ్ కథగా రాసినట్టు తెలుస్తుంది. మరి ఈ కథలో ఛార్మిని పెట్టి పూరి వెబ్ సిరీస్ చేస్తాడేమో చూడాలి.