హిజ్రాల కోసం ప్రత్యక ఏర్పాటు చేసిన ఎన్సీపీ

హిజ్రాల కోసం పార్టీలో ప్రత్యక వింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది మహారాష్ట్రకు చెందిన నేషనల్ కాంగ్రెస్ పార్టీ. దీనితో ఎల్జీబీటీ సెల్‌ ఏర్పాటు చేసిన తొలి రాజకీయ పార్టీగా ఎన్సీపీ రికార్డుకి ఎక్కింది. సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్‌ పాటిల్‌, పార్టీ ఎంపీ సుప్రియ సులే లాంఛనంగా ఎల్జీబీటీ వర్గం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వింగ్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ కుమార్తె, సుప్రియ […]

Written By: NARESH, Updated On : October 5, 2020 5:26 pm
Follow us on

హిజ్రాల కోసం పార్టీలో ప్రత్యక వింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది మహారాష్ట్రకు చెందిన నేషనల్ కాంగ్రెస్ పార్టీ. దీనితో ఎల్జీబీటీ సెల్‌ ఏర్పాటు చేసిన తొలి రాజకీయ పార్టీగా ఎన్సీపీ రికార్డుకి ఎక్కింది. సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్‌ పాటిల్‌, పార్టీ ఎంపీ సుప్రియ సులే లాంఛనంగా ఎల్జీబీటీ వర్గం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వింగ్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ కుమార్తె, సుప్రియ సూలే మాట్లాడుతూ… సమాజంలో అందరితో పాటు ఎల్జీబీటీ వర్గానికి సమాన హక్కులు దక్కాలని తమ పార్టీ భావిస్తున్నట్లు ఆమె చెప్పారు.