Anasuya fire on Big TV: బుల్లితెర యాంకర్ గా.. అంతకుముందు న్యూస్ ప్రజెంటర్గా.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. అనసూయ అందరికీ సుపరిచితమే. సోషల్ మీడియాలో అనసూయ విపరీతమైన ఆక్టివ్ గా ఉంటారు. అప్పుడప్పుడు సమాజానికి సంబంధించిన విషయాలను మాట్లాడుతుంటారు. తనకు నచ్చిన కామెంట్లను చేస్తుంటారు. కాకపోతే అవి వివాదాస్పదమవుతుంటాయి.
ఇప్పుడు అనసూయ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. అది కాస్త సంచలనంగా మారింది. బిగ్ టీవీ గతంలో ఆమెను ఇంటర్వ్యూ చేసింది. ఆ సమయంలో ఆమె నేను మద్యం తాగుతానని ఒక కామెంట్ చేశారు. అప్పుడెప్పుడో చేసిన ఇంటర్వ్యూ కి సంబంధించిన కామెంట్ ఇప్పుడు బిగ్ టీవీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దానికి సంబంధించిన వీడియో లింకు కూడా ఇచ్చింది. ఇది అనసూయకు తీవ్రస్థాయిలో కోపం తెప్పించింది. అంతే వెంటనే తన అగ్రహాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేసింది.. జర్నలిజం అంటే ఇలా కూడా ఉంటుందా అంటూ మండిపడింది.
అనసూయ మద్యం తాగుతాను అనే విషయాన్ని మాత్రమే బిగ్ టీవీ హైలెట్ చేసింది. ప్రస్తుతం కేబీఆర్ పార్కు వద్ద చెట్లను తొలగిస్తున్న అంశంలో అనసూయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఆ చెట్లను తొలగించకూడదని.. పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆమె సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. అయితే బిగ్ టీవీ దానిని పక్కనపెట్టి.. కేవలం తాను మద్యం తాగుతాను అనే విషయాన్ని మాత్రమే ప్రస్తావించడం ఏమాత్రం సరైనది కాదని అనసూయ అభిప్రాయపడింది.
బిగ్ టీవీ చేసిన పోస్టును ఉటంకిస్తూ అనసూయ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది జర్నలిజం కాదంటూ మండిపడ్డారు. వ్యక్తిత్వ హననాకి పాల్పడటం జర్నలిజం అవుతుందా అంటూ ఆమె ప్రశ్నించారు. బి గ్రేడ్ స్థాయిలో వ్యవహరిస్తున్న వ్యక్తులు జర్నలిస్టులు అని ఎలా చెప్పుకుంటారు అంటూ ఆమె ఆ గ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు మీకు సిగ్గు లేదని.. ఇలాంటి రాతలు రాస్తే జనం ఎలా సహిస్తున్నారని ఆమె ప్రశ్నించారు.. సాధారణంగా అనసూయ సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేస్తే దానికి విపరీతమైన రీచ్ ఉంటుంది. ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఉంది. మరి దీనిపై బిగ్ టీవీ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి.
5 ఏళ్ళ క్రితం మాట్లాడినా, నిన్న మాట్లాడినా… సోషల్ మీడియాలో ఒక్కసారి నోరు జారితే అది ఎప్పటికీ లైవ్లోనే ఉంటుంది అనసూయ గారు! అయినా మీడియా వాళ్ళు క్లిక్ బైట్స్ కోసం పాతవి తవ్వి తీయడం కొత్తేం కాదుగా, దీనికి మళ్ళీ ఇంత సీరియస్ రియాక్షన్ అవసరమా? #Tollywood https://t.co/lMBYyYlMIT
— Chaitanya.ch (@syncstudio4) May 22, 2026
