Hero Siddhardh: సినిమా వసూళ్లపై హీరో సిద్ధార్థ్ ఏమన్నాడంటే…

Hero Siddhardh: తెలుగు తమిళంలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగారు హీరో సిద్ధార్థ్. ఇటీవల విడుదలైన “మహాసముద్రం”  భారీ అంచనాలతో విడుదలవ్వగా బాక్సాఫీస్ వద్ద ఊహించనంత విజయం అందుకోలేకపోయింది. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వివాదస్పద వ్యాఖ్యలు చేయడం లో ముందుంటున్నారు  సిద్ధార్థ్. ఆ మధ్య సమంత ఎమోషనల్ ట్వీట్ కు రిప్లై‌గా అన్నట్టు.. సోషల్ మీడియాలో కొందరు స్టార్స్ కోట్లు ఖర్చుపెట్టి అభిమానుల్ని పెంచి పోషిస్తున్నారని, చివరికి తమ ఫ్యాన్సే తమని కాటేస్తారన్న […]

Written By: Raghava Rao Gara, Updated On : December 23, 2021 1:49 pm
Follow us on

Hero Siddhardh: తెలుగు తమిళంలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగారు హీరో సిద్ధార్థ్. ఇటీవల విడుదలైన “మహాసముద్రం”  భారీ అంచనాలతో విడుదలవ్వగా బాక్సాఫీస్ వద్ద ఊహించనంత విజయం అందుకోలేకపోయింది. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వివాదస్పద వ్యాఖ్యలు చేయడం లో ముందుంటున్నారు  సిద్ధార్థ్. ఆ మధ్య సమంత ఎమోషనల్ ట్వీట్ కు రిప్లై‌గా అన్నట్టు.. సోషల్ మీడియాలో కొందరు స్టార్స్ కోట్లు ఖర్చుపెట్టి అభిమానుల్ని పెంచి పోషిస్తున్నారని, చివరికి తమ ఫ్యాన్సే తమని కాటేస్తారన్న ఆయన వ్యాఖ్యలు వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా పాన్ ఇండియా సినిమాల కలెక్షన్స్ పై తనదైన స్టైల్లో కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.


హీరో సిద్ధార్థ్ తన ట్వీట్ లో ఈ విధంగా గా పేర్కొనడం జరిగింది.”సినిమాల కలెక్షన్ రిపోర్ట్స్‌ను తప్పుడుగా చూపించడానికి ఈ రోజుల్లో ఎంత కమీషన్ ముడుతోంది ఎంత రేట్ పలుకుతోంది? నిర్మాతలు చాలా కాలంగా బాక్సాఫీస్ లెక్కల గురించి అబద్ధాలు చెబుతున్నారు. ఇప్పుడు డ్రేడ్ వర్గాలు, మీడియా కూడా అధికారిక గణాంకాలివ్వడం ప్రారంభించాయి. అన్ని భాషలూ, అన్ని పరిశ్రమలూ ఒకేలా ఉన్నాయి. పాన్ ఇండియా నిజాయితీ రాహిత్యం”.అంటూ తన ట్వీట్ లో తెలిపారు. అయితే సిద్ధార్థ్ వ్యాఖ్యలపై పాన్ ఇండియా సినిమాల నిర్మాతలు ఎలా స్పందిస్తారో అనేది చూడాలి మరి. ప్రస్తుతం సిద్ధార్థ్ కార్తీక్ జి క్రిష్ దర్శకత్వంలో “టక్కర్” అనే చిత్రంలో నటిస్తున్నారు ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల అవును ఉంది.