అల్లరోడి ‘నాంది’ ఓటీటీలోకి !

టాలీవుడ్ కామెడీ హీరో అల్లరి నరేష్ ఒకప్పుడు వరుస హిట్స్ తో ఫుల్ బిజీగా ఉండేవాడు. కానీ, గత కొన్ని సినిమాలుగా హిట్ లేక సోలో హీరోగా మార్కెట్ లేక మొత్తానికి ఫుల్ డౌన్ ఫాల్ లో ఉన్నాడు అల్లరోడు. ప్రస్తుతం అల్లరి నరేష్ పరిస్థితి బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఉంది. కలెక్షన్స్ విషయంలో పూర్తిగా తెలిపోతూ గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతవుతూ తెగ ఇబ్బంది పడుతున్నాడు. దాంతో అతని సినిమాలు డైరెక్ట్ రిలీజ్ కి […]

Written By: admin, Updated On : January 27, 2021 5:12 pm
Follow us on


టాలీవుడ్ కామెడీ హీరో అల్లరి నరేష్ ఒకప్పుడు వరుస హిట్స్ తో ఫుల్ బిజీగా ఉండేవాడు. కానీ, గత కొన్ని సినిమాలుగా హిట్ లేక సోలో హీరోగా మార్కెట్ లేక మొత్తానికి ఫుల్ డౌన్ ఫాల్ లో ఉన్నాడు అల్లరోడు. ప్రస్తుతం అల్లరి నరేష్ పరిస్థితి బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఉంది. కలెక్షన్స్ విషయంలో పూర్తిగా తెలిపోతూ గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతవుతూ తెగ ఇబ్బంది పడుతున్నాడు. దాంతో అతని సినిమాలు డైరెక్ట్ రిలీజ్ కి కూడా నోచుకోవడం లేదు. అతి కష్టంమీద నరేష్ చేస్తోన్న ప్రయోగాత్మక చిత్రం ‘నాంది’.

కాగా తాజాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమాని జీ5 ఓటీటీ సంస్థ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఫుల్ రైట్స్‏ను తీసుకున్నట్లుగా సమాచారం. మొత్తం రూ.8.5 కోట్లకు ఒప్పందం కుదిరినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాది శాడ్ ఎండింగ్ అని.. బాగా ఎమోషనల్ గా సాగే క్లైమాక్స్ చివర్లో అల్లరి నరేష్ పాత్ర చనిపోతుందని.. సెంటిమెంట్ పీపుల్స్ కి ఈ సినిమా ప్రత్యేకంగా కనెక్ట్ అవుతుందని సమాచారం.

ఇందులో అల్లరి నరేష్ కాస్తా సీరియస్ లుక్‏లో కనిపించబోతున్నాడు. జైలు బ్యాక్ డ్రాప్‏లో ఉండనున్న ఈ మూవీని దర్శకుడు సతీష్ విగ్నేష్ నిర్మించడం ఇక్కడ మరో విశేషం. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ లో నరేష్ పోలీస్ స్టేషన్లో నగ్నంగా కూర్చోని ఉన్నాడు. దీంతో అల్లరి నరేష్ నుంచి థ్రిల్లర్ మూవీ రాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల నరేష్ నటించిన బంగారు బుల్లోడు థియేటర్లో విడుదైన సంగతి తెలిసిందే. పుల్ కామెడీ ఎంటర్ టైనర్‏గా వచ్చిన ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది.