తన కూతురుకి క్రేజీ నేమ్ పెట్టిన ‘హరితేజ’ !

బుల్లితెర పై చిన్న యాంకర్‌ గా కెరీర్ ను మొదలుపెట్టి పలు సీరియల్స్ తో మంచి పేరు తెచ్చుకుని, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దృష్టిలో పడి.. మొత్తానికి వెండితెరపై నటిగానూ సత్తా చాటి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి ‘హరితేజ’. అయితే ఈ భారీ నటి ఇటీవల ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి సినిమాలకు సీరియల్స్ కు దూరంగా ఉంటూ.. తన పూర్తి సమయాన్ని తన పాపకే కేటాయిస్తూ తల్లిగా మధుర స్మృతులను […]

Written By: admin, Updated On : June 26, 2021 11:01 am
Follow us on

బుల్లితెర పై చిన్న యాంకర్‌ గా కెరీర్ ను మొదలుపెట్టి పలు సీరియల్స్ తో మంచి పేరు తెచ్చుకుని, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దృష్టిలో పడి.. మొత్తానికి వెండితెరపై నటిగానూ సత్తా చాటి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి ‘హరితేజ’. అయితే ఈ భారీ నటి ఇటీవల ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి సినిమాలకు సీరియల్స్ కు దూరంగా ఉంటూ.. తన పూర్తి సమయాన్ని తన పాపకే కేటాయిస్తూ తల్లిగా మధుర స్మృతులను ఆస్వాదిస్తోంది.

కాగా తాజాగా హరితేజ తన కూతురి బారసాల వేడుకను ఘనంగా జరిపింది. ఈ వేడుక తాలూకు ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేసింది. అయితే ఆమె ఫాలోవర్స్ ఈ ఫోటోలను తెగ లైక్ చేస్తూ షేర్ చేస్తున్నారు. కాకపోతే హరితేజ, తన కూతురి ముఖాన్ని మాత్రం క్లారిటీగా చూపించకపోయే సరికి అభిమానులు నిరాశ చెందారు. ఇంతకీ ఈ నటి తన గారాలపట్టికి ఏ పేరు పెట్టింది అంటే.. ‘భూమి దీపక్‌రావు’ అని నామకరణం చేసింది.

తన కూతురు పేరు గురించి చెబుతూ.. తన కూతురు పాయింట్ ఆఫ్ వ్యూలో ‘మా అమ్మానాన్న నాకు భూమి దీపక్‌ రావు అని పేరు పెట్టారు. భూమి అంటే చాలా సహనంతో ఉంటుంది అని వాళ్ళు అనుకుంటున్నారేమో.. కానీ సహనాన్ని పరీక్షిస్తే భూకంపాలే వస్తాయని వాళ్లకేం తెలుసు. మీరందరూ నన్ను భూమి అని పిలవచ్చు’ అంటూ తన కూతురు అభిప్రాయం ఇలాగే ఉంటుంది అన్నట్టు మొత్తానికి ఈ క్రేజీ క్యాప్షన్‌ కూడా ఇచ్చింది.

మొత్తానికి హరితేజ దంపతుల గారాల పట్టి భూమి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఇక డెలివరీ సమయంలో హరితేజ ఎన్నో ఇబ్బందులు బాధలు పడాల్సి వచ్చింది. తొమ్మిది నెలలు నిండిన సమయంలో ఆమెతో సహా ఆమె ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ తెలియడంతో.. ఆమె డెలివరీ చాలా కష్టంగా జరిగింది. కానీ ప్రస్తుతం హరితేజ ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంది.