Guppedantha Manasu Serial: శిరీష్ పై కుళ్లు.. జగతికి వార్నింగ్ ఇచ్చిన రిషి.. కథలో కీలక మలుపు?

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి ప్రేమకథతో సాగుతున్న ఈ సీరియల్ రేటింగులో టాప్ 5 లో ఉంటుంది. ఇక రిషి, వసు ప్రాజెక్టు కోసం ఓ ఊరికి వెళ్లిన సంగతి తెలిసిందే. అన్ని పనులు పూర్తయి తిరిగి వస్తున్న సమయంలో మధ్యలో ఆగి ఓ చెట్టుకింద భోజనం చేయడానికి కూర్చుంటారు. ఆ భోజనం జగతి పంపించగా.. ఆ విషయాన్ని చెప్పకుండా రిషికి పెడుతుంది. ఇక రిషి […]

Written By: Kusuma Aggunna, Updated On : September 14, 2021 1:00 pm
Follow us on

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి ప్రేమకథతో సాగుతున్న ఈ సీరియల్ రేటింగులో టాప్ 5 లో ఉంటుంది. ఇక రిషి, వసు ప్రాజెక్టు కోసం ఓ ఊరికి వెళ్లిన సంగతి తెలిసిందే. అన్ని పనులు పూర్తయి తిరిగి వస్తున్న సమయంలో మధ్యలో ఆగి ఓ చెట్టుకింద భోజనం చేయడానికి కూర్చుంటారు. ఆ భోజనం జగతి పంపించగా.. ఆ విషయాన్ని చెప్పకుండా రిషికి పెడుతుంది. ఇక రిషి తింటూ ఎవరు చేశారు అనే సరికి భయపడుతూ నేనే చేశాను అంటూ కవర్ చేస్తుంది. ఇక కాసేపు వారి మధ్య రొమాంటిక్ మాటలు, సీరియస్ మాటలు నడుస్తాయి. వసు.. రిషిని చూస్తూ బైక్ పై వస్తున్న విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. ఇక ఇద్దరు భోజనం చేసి అక్కడ నుండి బయలు దేరుతారు.

జగతి వసు కోసం ఎదురు చూడగా మహేంద్ర వసును చూసి జగతికి చెబుతాడు. ఇవాళ వెళ్లిన పని ఎలా జరిగిందని ప్రశ్నించగా.. అన్ని పనులు చకా చకా జరిగాయంటూ అసాధ్యమైన పనులు కూడా పూర్తయ్యాయి అంటూ సంతోషంగా చెబుతుంది. మీ చేతి వంట తిని రిషి మెచ్చుకున్నాడు అంటుంది. కానీ నేను చేసిన అనే విషయం చెప్పలేదు కదా అంటూ అందుకే తిన్నాడు ఏమో అని జగతి అంటుంది. మంచి కోసం అబద్ధం చెప్పొద్దు కదా అంటూ వసు నచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి విషయాలు నాకు సంతోషాన్ని ఇవవ్వు అంటూ ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది. ఇక మహేంద్ర రిషి గురించి అడగడంతో ఇవాళ ఎటువంటి గొడవ పడలేదు అంటూ సరదాగా లాంగ్ డ్రైవ్ కి వెళ్లినట్లు ఉంది అంటూ చెబుతుంది.

దేవయాని రిషి గురించి ఆలోచిస్తుంది. తన భర్తతో రిషి గురించి అడిగేసరికి.. ప్రాజెక్టు పని కోసం బయటికి వెళ్లాడు అంటూ చెబుతున్న సమయంలో రిషి వస్తాడు. ప్రాజెక్టు ఎలా ఉంది అని తన పెదనాన్న అడిగేసరికి సంతోషంగా బదులిస్తాడు. దేవయాని మనసులో కుళ్ళుకుంటూ.. ఇంతకు ఎవరెవరు వెళ్లారు అని అడుగుతుంది. రిషి, వసు అని చెప్పేసరికి.. మనసులో వసు గురించి కోపమవుతుంది. ఇక శిరీష్ రిషి గురించి వసుతో మాట్లాడుతాడు. రిషి గురించి వెటకారంగా మాట్లాడటంతో వసు కోపం అవుతూ రిషి సార్ విషయంలో మర్యాదగా ఉండాలి అంటూ రిషి గురించి పొగుడుతున్న సమయంలో మహేంద్ర ఆ మాటలు విని సంతోష పడతాడు.

ఇక రిషి కర్చీఫ్ చూస్తూ.. వసు అన్న మాటలు గుర్తుకు చేసుకుంటాడు. ఆ కర్చీఫ్ అక్కడ నుండి ఎగిరి పోతూ ఉంటే పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. దేవయాని కర్చీఫ్ పై కాలు పెడుతున్న సమయంలో వచ్చి ఆపి తీసుకుంటాడు. ఇక రిషి వసు గురించి నెగటివ్ గా చెబుతుంది. కానీ రిషి మాత్రం వసుని పొగిడి అక్కడనుండి వెళ్లి ఈ రోజు జరిగిన జర్నీ గురించి తలుచుకుంటాడు. ప్రతిసారి ఆ కర్చీఫ్ ను చూస్తూ వసుతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ హాయిగా ఫీల్ అవుతాడు. ఇక తరువాయి భాగంలో వసు శిరీష్ కి ఎందుకు అని చెప్పావు అంటూ ఫైర్ అవుతాడు. ఇక జగతి తో శిరీష్ ఎక్కువగా వస్తున్నాడు రాకుండా చూసుకోవాలి అని అనేసరికి.. జగతి సమాధానం చెప్పడంతో రిషి కోపం అవుతాడు.