Peddi Movie: ‘ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై , మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని , బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగులేని బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. సినిమా విడుదలై రెండు వారాలు అయ్యింది , అయినప్పటికీ కూడా ఈ వీకెండ్ లో కూడా ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందులకంటే ఈ చిత్రం లో బుధవారం నుండి సరికొత్త సన్నివేశాలను జత చేశారు, వాటికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముందే ఈ సన్నివేశాలను జత చేసుంటే , సినిమాకు ఇంకా గొప్ప పాజిటివ్ టాక్ వచ్చేది జాన్వీ కపూర్ పాత్రపై ఇన్ని విమర్శలు వచ్చేవి కాదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమాలో ఇంకా చాలా సన్నివేశాలను తొలగించారు. అందులో ప్రముఖ సీనియర్ హీరో సాయి కుమార్ కి సంబంధించిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఏప్రిల్ 30 నుండి ఈ సినిమా వాయిదా పడినప్పుడు , మేకర్స్ ఐటెం సాంగ్ తో పాటు , కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేయడం , అదే విధంగా కొన్ని కొత్త సన్నివేశాలను తెరకెక్కించడం వంటివి చేశారు. ఆ సన్నివేశాల్లో సీనియర్ హీరో సాయి కుమార్ కూడా ఉన్నాడు. ఆయన షూటింగ్ లో పాల్గొన్న వీడియోస్ కూడా ఉన్నాయి. ఒక అభిమాని తో సరదాగా ముచ్చటించిన వీడియో కూడా ఉంది. అయితే ఆయన సన్నివేశాలను చిత్రీకరించినప్పటికీ సినిమా నుండి తొలగించడానికి కారణం , మూవీ రన్ టైం అని అంటున్నారు. సినిమా నిడివి దృష్ట్యా , ఈ సన్నివేశం ఉన్నా లేకపోయినా పర్వాలేదని, పెద్ద ప్రభావం చూపదని , అందుకే చిత్రం నుండి తొలగించారని అంటున్నారు.
రీసెంట్ గా జత చేసిన కొత్త సన్నివేశాల్లో , సాయి కుమార్ సన్నివేశాలను కూడా జత చేయొచ్చు కదా అని సోషల్ మీడియా లో రామ్ చరణ్ నుండి ఎదురు అవుతున్న ప్రశ్న. ఇకపోతే ఈ చిత్రం 200 కోట్ల షేర్ మార్కుకి చాలా దగ్గరగా ఉంది. ఈ వీకెండ్ తో ఆ మార్కుని కచ్చితంగా అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఓవరాల్ గా క్లోజింగ్ లో అన్ని వెర్షన్స్ కి కలిపి 345 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తుందని , రామ్ చరణ్ కి కీలకమైన సమయం లో మంచి హిట్ గా నిలిచిందని , కానీ ఇది ఆయన స్థాయికి తగ్గ బ్లాక్ బస్టర్ కాదని అంటున్నారు. ఎందుకంటే ఓవర్సీస్, కర్ణాటక , తమిళనాడు మార్కెట్స్ లో పెద్ద డిజాస్టర్ గా నిల్చింది ఈ చిత్రం. అదే విధంగా నెల్లూరు, రాయలసీమ ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టం.
