Pawan Kalyan Pithapuram Students Free Education: ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు దేశంలోనే సంచలనం గా మారాయి. ముఖ్యంగా ఆయన ఆద్వర్యం లో నడుస్తున్న పంచాయితీ రాజ్ శాఖకు జాతీయ అవార్డులు వెల్లువలాగా కురుస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ కి లభిస్తున్న ఈ అరుదైన గౌరవాలు గురించే మాట్లాడుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఈ నిర్ణయంపై పవన్ కళ్యాణ్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తన పిఠాపురం నియోజకవర్గాన్ని అన్నీ రంగాల్లోనూ రోల్ మోడల్ గా మార్చాలని కంకణం కట్టుకున్నాడు. అందులో భాగంగా ఆయన విద్యార్థులకు వరాలు కురిపించాడు. ఇప్పటికే ఆయన తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలను పిఠాపురం నియోజకవర్గం లో దత్తత తీసుకొని, నెలకు తన జీతం నుండి 5000 రూపాయిలు ఒక్కొక్కరికి అందిస్తున్నాడు.
వీరిలో రీసెంట్ గా విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో 550 కి పైగా మార్కులు సాధించిన ఒక విద్యార్థి కూడా ఉన్నాడు. అదే విధంగా పిఠాపురం నియోజకవర్గం లో 10 వ తరగతి లో అద్భుతమైన ప్రతిభ ని చూపించిన విద్యార్థులకు , వారి అభిరుచికి తగ్గట్టుగా ఉచితంగా ఉన్నత విద్యాబ్యాసం కల్పించే కార్యక్రమాన్ని తలపెట్టాడు పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గం లో దాదాపుగా 31 మంది విద్యార్థులు 580 కి పైగా మార్కులు సాధించారు. వీరిలో ఒకరు 598 మార్కులు సాధించి , రాష్ట్రంలోనే అగ్రస్థానం లో ఉన్నారు. వీళ్ళ ప్రతిభ ని ప్రోత్సహిస్తూ , ఉచితంగా ఉన్నత విద్యని అందించాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయ్యాడు. అందులో భాగంగా ఆ విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి , వారి ఆసక్తి అనుగుణంగా టాప్ విద్య సంస్థల్లో ఉచితంగా ఈ విద్యార్థులకు విద్యని అందించే విధంగా చూస్తానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
తన నిర్ణయాన్ని గౌరవించి అడిగిన వెంటనే ఆ విద్యార్థులకు ఉచిత విద్య ని అందించడానికి ముందుకొచ్చిన విద్య సంస్థలకు పవన్ కళ్యాణ్ కృతఙ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్ లాగానే ఇతర నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా ఇలా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తే బాగుంటుందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఆరోగ్యపరంగా ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోనప్పటికీ , ప్రభుత్వ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నాడు. మరో రెండు మూడు రోజుల్లో ఆయన అధికారికంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు.