తమిళ స్టార్ హీరో విజయ్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. తెలుగులో మహేష్ బాబుకు ఉన్నంత క్రేజ్ తమిళ్ లో విజయ్ కు ఉంది. మహేష్ సినిమాలు ఎన్నింటినో ఆయన తమిళంలో రిమేక్ చేశాడు. స్టార్ హీరోగా ఎదిగాడు.
అయితే తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమాకు విజయ్ ఓకే చెప్పాడు. దీంతో ఈ తమిళ హీరో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ విషయాన్ని తాజాగా దర్శకుడు వంశీ చెప్పారు.
స్టార్ హీరో విజయ్ తో ఓ ప్రాజెక్ట్ ఓకే అయ్యిందని.. విభిన్నమైన కథ.. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తారని వంశీ తెలిపారు. లాక్డౌన్ తర్వాత దీనిపై అధికారికంగా ప్రకటిస్తామన్నారు.
నిజానికి ఈ కథను మహేష్ బాబు కోసం వంశీ రాసుకున్నారు. ‘మహర్షి’ తర్వాత వంశీతో మరో సినిమా చేయడానికి మహేష్ ఓకే చెప్పాడు. అయితే కథ రెడీ చేసి చెప్పగా మహేష్ రిజెక్ట్ చేసినట్టు సమాచారం.
దీంతో ఇదే కథను తమిళ హీరో విజయ్ తో వంశీ ఓకే చేసుకున్నట్టు సమాచారం. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు.