మరో బయోపిక్ లో ‘మహానటి’?

‘నేను శైలజ’ మూవీతో కీర్తి సురేష్ తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది. హీరో రామ్ కు జోడీగా నటించి మెప్పించింది. తొలి మూవీతోనే కుర్రకారులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది కీర్తి సురేష్. ఆ తర్వాత నాని మూవీలో, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పక్కన నటించింది. టాలీవుడ్లో వరుస ఆఫర్లతో దూసుకుపోతూనే దక్షిణాది చిత్రాల్లో నటించింది. కాగా దర్శకుడు నాగశౌర్య దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’లో నటించి జాతీయ స్థాయి అవార్డు దక్కించుకుంది. అలనాటి నటి ‘సావిత్రి’ క్యారెక్టర్లో […]

Written By: Neelambaram, Updated On : April 25, 2020 2:58 pm
Follow us on


‘నేను శైలజ’ మూవీతో కీర్తి సురేష్ తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది. హీరో రామ్ కు జోడీగా నటించి మెప్పించింది. తొలి మూవీతోనే కుర్రకారులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది కీర్తి సురేష్. ఆ తర్వాత నాని మూవీలో, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పక్కన నటించింది. టాలీవుడ్లో వరుస ఆఫర్లతో దూసుకుపోతూనే దక్షిణాది చిత్రాల్లో నటించింది. కాగా దర్శకుడు నాగశౌర్య దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’లో నటించి జాతీయ స్థాయి అవార్డు దక్కించుకుంది. అలనాటి నటి ‘సావిత్రి’ క్యారెక్టర్లో కీర్తి సురేష్ అద్భుతంగా నటించింది. ఈ మూవీ తర్వాత కీర్తి సురేష్ దక్షిణాదిలో బీజీగా స్టార్ గా మారిపోయింది.

ప్రస్తుతం హిందీ, తమిళం, తెలుగులో కలిపి నాలుగు సినిమాల్లో నటిస్తుంది. హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలతోపాటు గ్లామర్ పాత్రల్లో కనిపించనుంది. యంగ్ హీరో నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ‘రంగ్ దే’ మూవీలో నటిస్తుంది. అలాగే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదిలా ఉండగా ఆమె మరో క్రేజీ ప్రాజెక్టులో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సూపర్ కృష్ణ భార్య విజయనిర్మల జీవితాధారంగా ఆమె కుమారుడు నరేష్ ఓ మూవీ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

ఈ బయోపిక్ లో కీర్తి సురేష్ టైటిల్ రోల్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ కోసం ఆమె భారీగా డిమాండ్ చేస్తుందనే ప్రచారం జరుగుతుంది. దీంతో ఆమ ఈ మూవీలో నటిస్తుందా? లేదా అనేది తేలాల్సి ఉంది. ఈ మూవీ ప్రారంభమయ్యే నాటికి విజయ నిర్మల నటించే హీరోయిన్ విషయంలో క్లారిటీ రానుంది. అంతవరకు వేచి చూడాల్సిందే..!