‘ఆచార్య’.. ట్రైలర్ చూసి ఆ చానల్ వెనక్కి పోయిందా?

చిరంజీవి హీరోగా ప్రముఖ సీనియర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’. చిరంజీవి-కొరటాల కాంబినేషన్ కావడంతో దీనికి ఫుల్ బిజినెస్ జరుగుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ శాటిలైట్ డీల్ తోనే మొదలు కావడం విశేషం. మొదటిషెడ్యూల్ కూడా పూర్తి కాకుండానే శాటిలైట్ రైట్స్ లాక్ చేశారు. తీరా అంతా ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు అదే డీల్ మళ్లీ మొదటికి వచ్చినట్టు సమాచారం. సినిమా మొదలు కాగానే తెలుగులోనే ప్రముఖ ఎంటర్ […]

Written By: NARESH, Updated On : February 6, 2021 5:09 pm
Follow us on

చిరంజీవి హీరోగా ప్రముఖ సీనియర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’. చిరంజీవి-కొరటాల కాంబినేషన్ కావడంతో దీనికి ఫుల్ బిజినెస్ జరుగుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ శాటిలైట్ డీల్ తోనే మొదలు కావడం విశేషం. మొదటిషెడ్యూల్ కూడా పూర్తి కాకుండానే శాటిలైట్ రైట్స్ లాక్ చేశారు. తీరా అంతా ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు అదే డీల్ మళ్లీ మొదటికి వచ్చినట్టు సమాచారం.

సినిమా మొదలు కాగానే తెలుగులోనే ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానెల్ రంగ ప్రవేశం చేసిన శాటిలైట్ రైట్స్ కోసం భారీ ఆఫర్ ఇచ్చి ఖాయం చేసుకుంది. అయితే తాజాగా ట్రైలర్ విడుదలయ్యాక ఏమైందో కానీ డీల్ నుంచి వెనక్కి తగ్గినట్టు సమాచారం.

దీంతో ఇప్పుడు మళ్లీ ఆచార్య శాటిలైట్ రైట్స్ కోసం ఫ్రెష్ గా పందేరం మొదలుపెడుతున్నారట.. ఈసారి శాటిలైట్, డిజిటల్, డబ్బింగ్ రైట్స్ అన్నీ కలిపి ఓకేసారి అమ్మాలని నిర్మాతలు డిసైడ్ అయినట్టు తెలిసింది.

ఇప్పటికే ఆచార్యకు కళ్లు చెదిరే మొత్తం నైజాంకు అమ్ముడుపోయింది. ఓవర్సీస్ కూడా భారీ ధరకు లాక్ అయ్యింది. మరో 2 వారాల్లోనే మిగతా రైట్స్ ఇచ్చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట..

చిరంజీవి, రాంచరణ్ కలిసి నటిస్తున్న ఈ మూవీపై బోలెడు అంచనాలున్నాయి. మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. నిరంజన్ రెడ్డి , రాంచరణ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.