Actor attacks Bandla Ganesh: మన సినీ ఇండస్ట్రీ లో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి , ఆ తర్వాత అగ్ర నిర్మాతగా మారి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తీసిన వ్యక్తి బండ్ల గణేష్. ఇతను కేవలం ఒక నటుడు , నిర్మాత మాత్రమే కాదు, ఒక మంచి పారిశ్రామిక వేత్త కూడా. అయితే ఈమధ్య కాలం లో ఆయన సినిమాలకు దూరమయ్యాడు , కేవలం తన వ్యాపారాల మీదనే ద్రుష్టి పెట్టాడు, అయితే ఇప్పుడు మరోసారి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న బండ్ల గణేష్ , ప్రముఖ సీనియర్ నటుడు రాజా రవీంద్ర కి సంబంధించిన ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడిన మాటలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి, అవేంటో ఒకసారి చూద్దాం.
ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొత్తల్లో తనకు ఎదురైనా ఒక చేదు అనుభవాన్ని తల్చుకుంటూ ఆయన ఈ ఇంటర్వ్యూ లో బాధపడ్డాడు. ఆయన మాట్లాడుతూ ‘సౌందర్య చనిపోయిన రోజు , నేను ఒక షూటింగ్ లో ఉన్నాను. నేను తో సహచర నటులతో కలిసి కూర్చొని ఉన్నాను. నా ఎదురుగా ఒక ప్రముఖ సీనియర్ ఆర్టిస్టు ఉన్నాడు. చాలా గొప్ప వ్యక్తి , ఆయన నాకు ఎంతో సహాయం చేశారు కూడా. నా అలవాటు లో పొరపాటుగా, సార్ సార్ అంటూ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశాను . కానీ ఒక్కసారిగా ఆయన ఆవేశం తో నన్ను చెప్పు తీసుకొని కొట్టాడు. ఏ తప్పు చేయకుండా, నేను చెప్పు దెబ్బలు తినాల్సి వచ్చిందే అని చాలా బాధపడ్డాను. ఆ తర్వాత పాపం ఆయన వేరే ఎదో టెన్షన్ లో ఉన్నాడు లే, అందుకే ఇలా రియాక్ట్ అయ్యాడు అని నాకు నేను సర్దిచెప్పుకున్నాను. ఆ తర్వాత పక్క రోజు ఆయనే వచ్చి నాకు క్షమాపణలు చెప్పాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.
అయితే బండ్ల గణేష్ ని ఇలా అకారణంగా చెప్పు తీసుకొని కొట్టిన ఆ సీనియర్ ఆర్టిస్ట్ ఎవరు?, అనే దానిపైనే ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియా లో చర్చ నడుస్తోంది. ఇంతటి కోపం కేవలం ఇద్దరికీ మాత్రమే ఉంటుంది , ఒకరు బాలయ్య బాబు , మరొకరు మోహన్ బాబు. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టు అన్నాడు కాబట్టి, వీరిద్దరూ కాకపోవచ్చు , మరి ఎవరు అయ్యుంటారు?, బ్రహ్మానందం అయ్యుండొచ్చా?, లేదా కొత్త శ్రీనివాసరావు అయ్యుండొచ్చా ? అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంచనాలు వేస్తున్నారు.
