NTR’s EMK Show: ఎన్టీఆర్ నే కంగారు పెట్టించిన టీచర్.. వణికిపోయాడు

NTR’s EMK Show: తెలుగు నాట ఇప్పుడు రియాలిటీ షోల సందడి నెలకొంది. అటు ఎన్టీఆర్ హోస్ట్ గా ‘మీలో ఎవరు కోటీశ్వరులు’.. ఇటు నాగార్జున హోస్ట్ గా ‘బిగ్ బాస్ ’ సీజన్5 మొదలు కావడంతో టీవీ ప్రేక్షకులు పండుగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ తనదైన హోస్టింగ్ తో ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ షోను రక్తికట్టిస్తున్నాడు. ఆసక్తికరంగా.. వినోదపరంగా, నాలెడ్జ్ కు పరీక్ష పెట్టే కార్యక్రమంగా ఇది కొనసాగుతోంది. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం కావడంతో […]

Written By: NARESH, Updated On : September 7, 2021 11:15 am
Follow us on

NTR’s EMK Show: తెలుగు నాట ఇప్పుడు రియాలిటీ షోల సందడి నెలకొంది. అటు ఎన్టీఆర్ హోస్ట్ గా ‘మీలో ఎవరు కోటీశ్వరులు’.. ఇటు నాగార్జున హోస్ట్ గా ‘బిగ్ బాస్ ’ సీజన్5 మొదలు కావడంతో టీవీ ప్రేక్షకులు పండుగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ తనదైన హోస్టింగ్ తో ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ షోను రక్తికట్టిస్తున్నాడు. ఆసక్తికరంగా.. వినోదపరంగా, నాలెడ్జ్ కు పరీక్ష పెట్టే కార్యక్రమంగా ఇది కొనసాగుతోంది.

సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం కావడంతో ఈ వారం టీజర్లతో షో నిర్వహించనున్నట్టు చెప్పారు. సోమవారం సెప్టెంబర్ న టెక్కలికి చెందిన టీచర్ సింహాచలం హాట్ సీట్ పైకి వచ్చారు. పేదరికంలో పుట్టిన ఆయన కష్టపడి ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఉద్యోగం సంపాదించాడు. ప్రస్తుతం తన సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తో సింహాచలం ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ గేమ్ ఆడారు.

ఇల్లు కట్టుకోవాలనే తపనతో ఆడుతున్న సింహా చలం ఏమాత్రం భయం, బెరుకు లేకుండా సరదాగా.. స్ఫూర్తిగా ఆడుతుండడం ఎన్టీఆర్ ను సైతం ఆశ్చర్యపరిచింది. హాట్ సీట్లో కూర్చున్న ఎన్టీఆర్ సైతం టెన్షన్ పడుతున్నా టీచర్ సింహాచలం చాలా టేకీటీజీగా ఆడడం ఎన్టీఆర్ కు ముచ్చటేసింది. ఎన్టీఆర్ కే చమటలు పట్టించేలా టీచర్ గేమ్ ఆడేశాడు.

12,50,000 గెలుచుకునే 12వ ప్రశ్నగా ‘ఆంధ్ర మహిళా సభ స్థాపించిన దుర్గాభాయ్ దేశ్ ముఖ్ వివాహం చేసుకున్న వ్యక్తి.. వీటిలో ఏ పదవి చేపట్టిన మొదటి భారతీయుడు? అని ఎన్టీఆర్ ఎంతో కష్టమైన ప్రశ్న ఇచ్చినా కూడా ఏమాత్రం తడబడకుండా టీచర్ సింహాచలం ఠక్కున ‘ఆర్బీఐ గవర్నర్’ అని చెప్పాడు. ఈ ప్రశ్నకు ఎన్టీఆర్ టెన్షన్ పడ్డా.. టీచర్ మాత్రం చాలా కూల్ గా కుర్చీని లాక్ చేయండని కోరాడు. ఎన్టీఆర్ లో ఉన్న టెన్షన్ బెరుకు కూడా టీచర్ లో లేకపోవడం చూసి అంతా అవాక్కయ్యారు. టీచర్ ను ఎన్టీఆర్ పొగడ్తల వర్షంలో ముంచెత్తారు.

ఇక 25 లక్షల ప్రశ్న రాగా.. టైం అయిపోవడంతో ఈ ఎపిసోడ్ ఈరోజుకు వాయిదా పడింది. సింహాచలం 25 లక్షలు గెలుస్తాడా? లేదా? అన్నది వేచిచూడాలి. ఈరోజు అది తేలనుంది.