విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. విశాఖ మన్యంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. ఏజెన్సీలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విశాఖలో వర్షాలకు ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. నేడు, రేపు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేస్తున్నారు.