‘వి’ సినిమాపై.. ఆ ఫీలింగ్ లేదంటున్న నాని 

ప్రస్తుతం థియేటర్లు మూతపడటంతో సినిమాను రిలీజు చేసేందుకు ఓటీటీలే బెస్ట్ ఆప్షన్ అని న్యాచురల్ స్టార్ నాని అన్నారు. ఇప్పట్లో థియేటర్లు తెరుచుకున్నా ప్రేక్షకులు వస్తారో రాదో తెలియని పరిస్థితుల్లో గత్యంతరం లేకనే నిర్మాతలు ఓటీటీల్లో సినిమాలను రిలీజు చేస్తున్నారని నాని తెలిపారు. అందుకే ‘వి’ సినిమా కూడా థియేటర్లలో కాకుండా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నట్లు హీరో నాని స్పష్టం చేశారు. నాని నటించిన 25 సినిమాగా ‘వి’ చిత్రం రాబోతున్న సంగతి తెల్సిందే. అయితే తనకు […]

Written By: NARESH, Updated On : September 3, 2020 6:31 pm

Tollywood

Follow us on

ప్రస్తుతం థియేటర్లు మూతపడటంతో సినిమాను రిలీజు చేసేందుకు ఓటీటీలే బెస్ట్ ఆప్షన్ అని న్యాచురల్ స్టార్ నాని అన్నారు. ఇప్పట్లో థియేటర్లు తెరుచుకున్నా ప్రేక్షకులు వస్తారో రాదో తెలియని పరిస్థితుల్లో గత్యంతరం లేకనే నిర్మాతలు ఓటీటీల్లో సినిమాలను రిలీజు చేస్తున్నారని నాని తెలిపారు. అందుకే ‘వి’ సినిమా కూడా థియేటర్లలో కాకుండా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నట్లు హీరో నాని స్పష్టం చేశారు.

నాని నటించిన 25 సినిమాగా ‘వి’ చిత్రం రాబోతున్న సంగతి తెల్సిందే. అయితే తనకు 25వ సినిమా అన్న ఫీలింగ్ ఏమాత్రం లేదని తన తొలి సినిమా మాదిరిగానే ఈ మూవీ కూడా చేసినట్లు చెప్పుకొచ్చాడు. తన తొలి మూవీ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణతో తన 25వ సినిమా చేయడం కేవలం యాదృచ్చికంగానే జరిగిందని చెప్పుకొచ్చారు. తన ఫస్టు సినిమా ‘అష్టచమ్మా’ చేసినప్పుడు తమ మధ్య ఎలాంటి అనుబంధం ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉన్నామని నాని చెప్పాడు.

‘వి’ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఈనెల 5న రిలీజ్ కానుందని.. ఓటీటీ ద్వారా మరింతమంది ప్రేక్షకులకు సినిమా దగ్గరవడం ఆనందం ఉందన్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ఫస్టు లుక్, ట్రైలర్, సాంగ్స్ కు మంచి స్పందన వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ఓటీటీ కంటెంటెక్ తగట్టుగానే ‘వి’ సినిమా ఉంటుందని తెలిపారు. ‘వి’ సినిమాలో సుధీర్ బాబుతోపాటు అదితి రావు హైదరీ, నివేధా థామస్ తో కలిసి నటించడం కొత్త అనుభూతిని ఇచ్చిందని చెప్పారు. తన అన్ని సినిమాల్లనే ఈ సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందని నాని తెలిపాడు.