Virat Kohli: విరాట్ కోహ్లీ మరదలు కూడా ఒక స్టార్ హీరోయిన్..రీసెంట్ గా ఒక బోల్డ్ సినిమా కూడా చేసింది..ఎవరో గుర్తుపట్టగలరా?

అనుష్క శర్మ విరాట్ కోహ్లీ కి సతీమణి అవ్వగా, రుహానీ శర్మ వరుసకు కోహ్లీ కి మరదలు అవుతుంది. ఈమె తెలుగు లోకి 'చి లా సౌ' అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. సుశాంత్ హీరో గా నటించిన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాకపోయినా, విమర్శకుల ప్రశంసలను అందుకుంది.

Written By: S Reddy, Updated On : August 21, 2024 5:26 pm

Ruhani Sharma(1)

Follow us on

Virat Kohli: క్రికెట్ రంగంలో ఎన్నో సంచలన రికార్డ్స్ ని నెలకొల్పి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకించి చెప్పేది ఏముంది. ఆయన అభిమానులకు కోహ్లీ గురించి తెలియని విషయమంటూ ఏది లేదు. ఇలా అనుకుంటే మాత్రం కచ్చితంగా పొరపాటే. విరాట్ కోహ్లీ కి ఒక మరదలు ఉందని, ఆమె ప్రస్తుతం మన టాలీవుడ్ లో హాట్ హీరోయిన్ గా కొనసాగుతూ యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుందనే విషయం చాలా మందికి తెలియదు. ఇంతకు ఆ అమ్మాయి ఎవరు ఏమిటి అనే పూర్తి వివరాలను మేము ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాము. ఆమె మరెవరో కాదు, రుహానీ శర్మ. ఈమె ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ కి సోదరి.

Also Read: ‘ఇంద్ర’ కి ఇద్దరు డైరెక్టర్లు పనిచేసారు..ఆ రెండో డైరెక్టర్ ఇండస్ట్రీ లోనే పెద్ద స్టార్ హీరో..ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలు!

అనుష్క శర్మ విరాట్ కోహ్లీ కి సతీమణి అవ్వగా, రుహానీ శర్మ వరుసకు కోహ్లీ కి మరదలు అవుతుంది. ఈమె తెలుగు లోకి ‘చి లా సౌ’ అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. సుశాంత్ హీరో గా నటించిన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాకపోయినా, విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈ సినిమా తర్వాత ఆమె ‘కమల’ ‘హిట్’, ‘డర్టీ హరి’, ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఇలా ఎన్నో చిత్రాల్లో నటించింది. అయితే 2019 వ సంవత్సరం లో ఆమె బాలీవుడ్ ‘ఆగ్రా’ అనే చిత్రం చేసింది. కొన్ని అడ్డంకులు ఏర్పడడం వల్ల, అనేక సార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్స్ లో అనుకున్నంత స్థాయిలో ఈ చిత్రం ఆడలేదు కానీ, ఈ ఏడాది న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితమైన అతి కొద్ది ఇండియన్ చిత్రాలలో ఒకటిగా ‘అగ్ర’ కూడా నిల్చింది. దీంతో ఈ సినిమాపై సోషల్ మీడియా లో క్రేజ్ ఏర్పడగా, అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ సంస్థలు డిజిటల్ రైట్స్ ని కొనుగోలు చేసి నిన్న స్ట్రీమింగ్ మొదలు పెట్టారు. ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు ఆశ్చర్యానికి గురయ్యారు.

Ruhani Sharma

కంటెంట్ సంగతి కాసేపు పక్కన పెడితే, ఈ చిత్రం లో రుహానీ శర్మ చేసిన అడల్ట్ సన్నివేశాలు, ఆడియన్స్ కి మతిపోయేలా చేసింది. శృంగార సన్నివేశాల్లో ఆమె ఇది వరకు ఏ హీరోయిన్ కూడా చెయ్యని రేంజ్ లో రెచ్చిపోయి మరీ చేసింది. నిన్నటి నుండి సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఈ సినిమాలో రుహానీ శర్మ చేసిన రొమాంటిక్ సన్నివేశాల వీడియోలే కనిపిస్తున్నాయి. తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు ఎప్పుడూ ఇలాంటి సన్నివేశాల్లో నటించని రుహానీ శర్మ ఒక్కసారిగా ఇలా రెచ్చిపోయిందేంటి అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ ఏడాది ఆమె విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన ‘సైంథ‌వ్‌’ చిత్రం లో ఒక ముఖ్య పాత్రలో కనిపించిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆమె ‘మాస్క్’ అనే తమిళ చిత్రంలో నటిస్తుంది.

Also Read:   సెప్టెంబర్ 2న ‘ఓజీ’ ఫ్యాన్స్ కి పండగే..క్రేజీ అప్డేట్ ఇచ్చిన నిర్మాత డీవీవీ దానయ్య!