అరె.. ఆ స్టార్స్ మధ్య దూరం తగ్గింది !

ఎంత గొప్ప స్నేహం అయినా అభిప్రాయబేధాల ముందు ఎక్కువ కాలం నిలబడలేదు. తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు త్రివిక్రమ్ – దేవి శ్రీ ప్రసాద్ మధ్య మంచి స్నేహం ఉండేది. పర్సనల్ గానూ ఇద్దరు చాలా సన్నిహితంగా ఉంటారు. కానీ ఏమైందో ఏమో.. దేవికి త్రివిక్రమ్ దూరం జరిగాడు. పైగా తన సినిమాల నుంచి దేవిశ్రీని పక్కనపెట్టాడు. త్రివిక్రమ్ నుండి ఇలాంటి వ్యవహారాన్ని ఊహించని దేవి, దాన్ని జీర్ణయించుకోలేకపోయాడు. అందుకే, త్రివిక్రమ్ తో ప్యాచప్ కి దేవి కూడా […]

Written By: admin, Updated On : June 18, 2021 3:40 pm
Follow us on

ఎంత గొప్ప స్నేహం అయినా అభిప్రాయబేధాల ముందు ఎక్కువ కాలం నిలబడలేదు. తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు త్రివిక్రమ్ – దేవి శ్రీ ప్రసాద్ మధ్య మంచి స్నేహం ఉండేది. పర్సనల్ గానూ ఇద్దరు చాలా సన్నిహితంగా ఉంటారు. కానీ ఏమైందో ఏమో.. దేవికి త్రివిక్రమ్ దూరం జరిగాడు. పైగా తన సినిమాల నుంచి దేవిశ్రీని పక్కనపెట్టాడు. త్రివిక్రమ్ నుండి ఇలాంటి వ్యవహారాన్ని ఊహించని దేవి, దాన్ని జీర్ణయించుకోలేకపోయాడు.

అందుకే, త్రివిక్రమ్ తో ప్యాచప్ కి దేవి కూడా ఆసక్తి చూపించలేదు. తనను కాదు అని అనిరుధ్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవడం, ఆ తర్వాత మిక్కీ జే మేయర్ కు ఛాన్స్ ఇవ్వడం, ఇక గత రెండు సినిమాలుగా తమన్ కే ఫిక్స్ అవడం దేవిని బాగా బాధ పెట్టింది. మ్యూజిక్ పరంగా త్రివిక్రమ్ దేవిని పక్కన పెట్టడం బాగాలేదని ప్రేక్షకులు కూడా ఫీల్ అయ్యారు.

కానీ తానూ మ్యూజిక్ విషయంలో కొన్ని ప్రయోగాలు చేస్తున్నానని ఓ సందర్భంలో త్రివిక్రమ్ చెప్పుకొచ్చాడు. దేవి కూడా త్రివిక్రమ్ గురించి అడిగితే నవ్వుతూ దాటవేశాడు తప్ప, అసలు విషయం చెప్పలేదు. మొత్తానికి దేవి-త్రివిక్రమ్ కు చెడిందనేది అందరికి అర్ధమైన విషయం. అయితే, ప్రస్తుతం వీరి మధ్య పెరిగిన దూరం తగ్గింది అని తెలుస్తోంది.

ఇటీవల దేవిశ్రీ కుటుంబంలో జరిగిన ఓ వేడుకకు త్రివిక్రమ్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ వేడుకలో పాల్గొన్న త్రివిక్రమ్, దేవి చాలా సన్నిహితంగా మెలిగారు అట. ఈ పరిణామంతో వీరిద్దరిలో కొత్త ఉత్సాహం, కొత్త ఊపు వచ్చిందట. మరి ఈ కొత్త కలయిక దేవిశ్రీ-త్రివిక్రమ్ ను మళ్ళీ కలుపుతుందేమో చూడాలి. వీరి కలిసి సినిమా చేస్తే.. వీరి కలయికలో పాటలు వస్తే వినాలని సాధారణ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఉన్నారు.