దుమ్ము రేపుతున్న ‘డర్టీ హరి’

లాక్‌డౌన్‌ తర్వాత ఓటీటీలు.. ఏటీటీలే సినీ వినోదాన్ని పంచుతున్నాయి. ఈ వేదికల ద్వారా తరచూ కొత్త సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. ఈ వీకెండ్‌లో ఫ్రైడే మూవీస్‌ అనే కొత్త ఓటీటీ వేదిక ద్వారా ‘డర్టీ హరి’ రిలీజ్‌ అయింది. ప్రముఖ నిర్మాత ఎమ్‌.ఎస్‌.రాజు దర్శకత్వం వహించారు. ప్రచార చిత్రాలు ఆకర్షించేలా ఉండడంతో ఈ సినిమా గురించి సినీ అభిమానులు ప్రత్యేకంగా ఎదురుచూశారు. Also Read: తెలుగు సినిమా భవిష్యత్తు సాయి తేజ్,రవితేజ డిసైడ్ చేస్తారా ? ఈ […]

Written By: Srinivas, Updated On : December 21, 2020 1:44 pm
Follow us on


లాక్‌డౌన్‌ తర్వాత ఓటీటీలు.. ఏటీటీలే సినీ వినోదాన్ని పంచుతున్నాయి. ఈ వేదికల ద్వారా తరచూ కొత్త సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. ఈ వీకెండ్‌లో ఫ్రైడే మూవీస్‌ అనే కొత్త ఓటీటీ వేదిక ద్వారా ‘డర్టీ హరి’ రిలీజ్‌ అయింది. ప్రముఖ నిర్మాత ఎమ్‌.ఎస్‌.రాజు దర్శకత్వం వహించారు. ప్రచార చిత్రాలు ఆకర్షించేలా ఉండడంతో ఈ సినిమా గురించి సినీ అభిమానులు ప్రత్యేకంగా ఎదురుచూశారు.

Also Read: తెలుగు సినిమా భవిష్యత్తు సాయి తేజ్,రవితేజ డిసైడ్ చేస్తారా ?

ఈ చిత్రం డిసెంబర్ 18 సాయంత్రం 6 గంటలకు విడుదలైంది. రొమాంటిక్ సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చినట్లుగా చిత్రయూనిట్‌, అలాగే ఫ్రైడే మూవీస్‌ ఏటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. శ్రవణ్ రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్ కౌర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ బోల్డ్ రొమాన్స్ డ్రామాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని… ఫ్రైడే మూవీస్ ఏటీటీలో విడుదలైన ఈ చిత్రం 24 గంటల్లో 91,818 వ్యూస్ దక్కించుకుందని తెలుపుతూ అధికారికంగా చిత్రయూనిట్‌ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.

Also Read: పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకి ముహూర్తం ఫిక్స్ !

ఇక ఈ చిత్రాన్ని అప్‌లోడ్ చేసినప్పుడు ఒకేసారి 25 వేల మంది వ్యూవర్స్ రావడంతో ఏటీటీ యాప్‌కు కొన్ని సాంకేతిక సమస్యలు కూడా తలెత్తాయి. ఈ చిత్రానికి ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించగా.. శ్రవణ్ రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్ కౌర్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. చిత్ర యూనిట్ మొదటి నుంచి హాట్ హాట్ పోస్టర్లను బాగా ప్రచారం చేయడంతో ఈ సినిమా ఏంటనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొనడం కూడా దీని విజయానికి ఓ కారణమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈ ఏటీటీ ప్రత్యేకత ఏమిటంటే.. ఒక్క టికెట్ తీసుకుంటే ఎంతమంది ఎన్నిసార్లైనా 24 గంటల టైమ్‌లో సినిమాని చూడవచ్చట. సినిమాకు మంచి టాక్ రావడంతో వ్యూస్ మరింతగా పెరుగుతాయని నమ్మకంగా ఉన్నట్లుగా దర్శక నిర్మాతలు తెలుపుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్