Homeఎంటర్టైన్మెంట్Maaran: ఓటీటీలో ధనుష్​ మారన్​ సినిమా.. ట్విట్టర్​లో ఫ్యాన్స్​ ఫైర్​

Maaran: ఓటీటీలో ధనుష్​ మారన్​ సినిమా.. ట్విట్టర్​లో ఫ్యాన్స్​ ఫైర్​

Maaran: ధనుష్​ నుంచి సినిమా వస్తోందంటే చాలు తమిళ అభిమానులతో పాటు, తెలుగులోనూ విపరీతమైన క్రేజ్​ ఉంది. తాజాగా, యువ దర్శకుడు కార్తీక్​ నరేన్​ దర్శకత్వంలో ధనుష్​ హీరోగా తెరకెక్కిన సినిమా మారన్​. ఈ సినిమాలో మాళవిక మోహనన్, స్మృతి వెంకట్, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం చివరి దశ పనులు జరుపుకుంటోంది.

maaran

ఈ సినిమాకు జివి ప్రకాశ్​ సంగీతం అందించారు. ధ్రువ పదహారు సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కార్తీక్ నరేన్.. ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో.. మారన్ సినిమాపై  భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ  సినిమాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నట్టు  ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

దీంతో ఒక్కసారిగా ధనుష్ అభిమానులు మారన్​ను థియేటర్​లోనే విడుదల చేయాలని ట్విట్టర్​ వేదికగా డిమాండ్​ చేస్తున్నారు. గతంలో ధనుష్​ నటించిన జగమే తంత్రం సినిమా ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో థనుష్​ స్పందిస్తూ… తన సినిమా ఓటీటీలో విడుదల కావడం ఇష్టం లేదని ట్వీట్ చేశారు. దీంతో మరాన్ సినిమాను ఖచ్చితంగా ఓటీటీలో రాదని అందరూ అనుకున్నారు. అయితే, ఈ వార్తతో అభిమానులకు నిరాశ ఎదురైంది. దీంతో మారన్​ను ఎలాగైనా థియేటర్లలోనే విడుదల చేయాలని డిమాండ్​ చేస్తున్నారు. ఇంకా మేకర్స్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు.

కాగా, ధనుష్​ వరుసగా సనిమాలతో బిజిగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దర్శకుడు సెల్వరాఘవన్‌ తెరకెక్కిస్తోన్న నానే వరువేన్ సినిమాలో నటిస్తున్నారు ధనుష్​.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular