అప్పట్లో మెగా స్టార్ చిరంజీవికి, విలక్షణ నటుడు మోహన్ బాబుకు మధ్య పెద్ద వివాదమే చెలరేగింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సాక్షిగా వీరిద్దరూ గొడవపడ్డారు. బయట ఇష్యూలల్లో కూడా చిరంజీవిపై విమర్శలు గుప్పించారు మోహన్ బాబు. అయితే పాత పగలు అన్నీ మరిచిపోయి ఈ ఏజ్ బార్ వేళ వీరిద్దరూ అనోన్యత చాటుకున్నారు.
ఇటీవల మా సమావేశంలో ఏకంగా మోహన్ బాబుకు చిరంజీవి ముద్దులు కూడా ఇవ్వడం వైరల్ అయ్యింది. ‘మాది టామ్ అండ్ జర్రీ’ బంధం అంటూ చిరంజీవి చాలా సార్లు మోహన్ బాబు గురించి సరదాగా మాట్లాడారు.
అయితే మోహన్ బాబు ఇంట్లో ఏ కార్యక్రమమైనా చిరంజీవి హాజరు తప్పనిసరి. ఈ మధ్య మోహన్ బాబు నటించి. ‘సన్ ఆఫ్ ఇండియా’ మూవీ టీజర్ కు చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడం వీరి మధ్య సాన్నిహిత్యానికి నిదర్శనంగా మారింది.
తాజాగా చిరంజీవి మరో సాయం కూడా చేయబోతున్నాడట..ఈ సినిమాలోనూ చిరంజీవి వాయిస్ ను పెడుతున్నారట.. ప్రధాన పాత్రలను పరిచయం చేసేందుకు చిరంజీవి గాత్రధానం చేయబోతున్నారు.
ఇక ఈ సినిమా విడుదలకు ముందు ఓ భారీ ఫంక్షన్ ఏర్పాటు చేసి దానికి చిరంజీవిని చీఫ్ గెస్ట్ గా పిలవలని మోహన్ బాబు యోచిస్తున్నాడు. దీన్ని బట్టి ఈ పాత మిత్రులు మళ్లీ కలిసిపోయారని చెప్పొచ్చు.