Chiranjeevi and Balakrishna: సినిమా ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలు వాళ్లకు సక్సెస్ లను ఇస్తే చాలు ఆ దర్శకులను రిపీటెడ్ గా సినిమాలు చేస్తూనే ఉంటారు. దానికి ఉదాహరణగా మనం చిరంజీవి, బాలయ్య బాబులను తీసుకోవచ్చు. 2023 వ సంవత్సరంలో బాలయ్యకు ‘వీర సింహారెడ్డి’ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందించిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఇక అదే సంవత్సరం బాబీ దర్శకత్వంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సైతం భారీ విజయాన్ని సాధించింది. అందుకే చిరంజీవి సైతం మరోసారి బాబీ ని రిపీట్ చేస్తూ అతనికి అవకాశాన్ని ఇచ్చాడు. బాబీ ఇంతకు ముందు బాలయ్య బాబుతో ‘డాకు మహరాజ్’ సినిమా చేశాడు. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సాధించడంతో చిరంజీవి అతన్ని పిలిచి మరి అవకాశం ఇచ్చాడు. రెండో సినిమాతో చిరంజీవిని ఎలా చూపిస్తాడు.
ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. బాబీకి ఇప్పటివరకు 90% సక్సెస్ రేట్ ఉంది. కాబట్టి ఆయన సినిమా వస్తుంది అంటే చాలు అది మినిమం గ్యారంటి సినిమాగా ప్రేక్షకులు ఒక అంచనాకి వచ్చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే బాబీ చిరంజీవిని ఎలా చూపిస్తాడు.
ప్రేక్షకులందరిని మెప్పించే విధంగా ఈ సినిమా ఉండబోతుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ఈ సినిమాలో మోహన్ లాల్ సైతం ఒక కీలకపాత్రలో నటించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కూడా చాలా వైల్డ్ గా ఉండబోతుందట. ఇక చిరంజీవి బాబీ ఇంతకు ముందు చేసిన వాల్తేరు వీరయ్య సినిమా మాస్ కమర్షియల్ ప్రేక్షకులను అలరించింది.
ఇప్పుడు వస్తున్న సినిమాతో వాళ్ళని టార్గెట్ చేస్తూనే ఒక డెప్త్ స్టోరీని చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారట… గోపీచంద్ మలినేని, బాబీ ఇద్దరు కూడా మరోసారి వాళ్ళని నమ్మిన హీరోలకు సక్సెస్ లను అందిస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది… ఇక ఈ రెండు సినిమాలను కూడా 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు…
