Deepika Padukone: దీపికా పదుకొనె తల్లి కాలేదా… ఫేక్ ప్రెగ్నెన్సీ తో పెద్ద మోసానికి ప్లాన్?

దీపికా-రణ్వీర్ విడాకులు తీసుకుంటున్నారనే పుకార్లు కూడా వచ్చాయి. సడన్ గా ఈ ఏడాది ప్రారంభంలో దీపికా పదుకొనె ప్రెగ్నెన్సీ ప్రకటన చేసింది.

Written By: S Reddy, Updated On : July 3, 2024 8:52 am

Deepika Padukone

Follow us on

Deepika Padukone: దీపికా పదుకొనె గర్భం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సామాన్యులతో పాటు కొందరు వైద్య నిపుణులు ఆమెది సహజ గర్భం వలె లేదంటున్నారు. ఈ క్రమంలో దీపికా పదుకొనె అందరినీ మోసం చేస్తున్నారనే ప్రచారం మొదలైంది. దీపికా పదుకొనె పరిశ్రమకు వచ్చాక వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. అనతి కాలంలో బాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగింది. బడా బడా స్టార్స్, డైరెక్టర్స్ తో పని చేసింది. అద్భుతమైన చిత్రాలలో ఆమె నటించారు.

ఇదే సమయంలో దీపికా పదుకొనె పలువురు హీరోలు, బిజినెస్ మెన్, క్రీడాకారులతో ఎఫైర్స్ నడిపారు. రన్బీర్ కపూర్ తో దీపికా ఎఫైర్ ఘాడంగా సాగింది. అతనికి బ్రేకప్ చెప్పిన దీపికా తీవ్ర డిప్రెషన్ కి గురయ్యారనే వాదన ఉంది. అనంతరం 2018లో హీరో రణ్వీర్ సింగ్ ని వివాహం చేసుకుంది. వీరిది కూడా పేమ వివాహమే. పెళ్ళై ఏళ్ళు గడుస్తున్నా దీపికా పదుకొనె తల్లి కాలేదు. దీపికా-రణ్వీర్ పెద్దగా సాన్నిహిత్యంగా ఉన్నట్లు కూడా కనిపించరు. ఏదో సమాజం కోసం పెళ్లి చేసుకున్నారు అనే భావన కలుగుతుంది.

దీపికా-రణ్వీర్ విడాకులు తీసుకుంటున్నారనే పుకార్లు కూడా వచ్చాయి. సడన్ గా ఈ ఏడాది ప్రారంభంలో దీపికా పదుకొనె ప్రెగ్నెన్సీ ప్రకటన చేసింది. సెప్టెంబర్ లో బిడ్డకు జన్మను ఇవ్వబోతున్నట్లు వెల్లడించింది. ఇటీవల దీపికా పదుకొనె బేబీ బంప్ తో దర్శనం ఇస్తున్నారు. కల్కి చిత్ర ప్రమోషన్స్ లో టైట్ ఫిట్ ధరించడంతో దీపికా పదుకొనె బేబీ బంప్ మరింత హైలెట్ అయ్యింది. దీపికా బేబీ బంప్ చూసిన ప్రముఖ IVF నిపుణురాలు గౌరీ అగర్వాల్ అనుమానాలు వ్యక్తం చేసింది.

దీపికా పదుకొనె గర్భం సహజంగా లేదు. ఆమె ఫేక్ బేబీ బంప్ తో మోసం చేస్తున్నారేమో అని అభిప్రాయ పడ్డారు. గర్భం దాల్చినట్లు అబద్దం చెప్పిన దీపికా, సరోగసి ద్వారా బిడ్డను కనేందుకు ప్లాన్ చేస్తున్నారనే వాదనలు ఉన్నాయి. చాలా మంది హీరోయిన్స్ సరోగసి పద్దతిలో పిల్లల్ని కన్నారు. నయనతార, ప్రియాంక చోప్రా, మంచు లక్ష్మి తో పాటు పలువురు సరోగసీని ఆశ్రయించారు. వారు నేరుగా ఈ పని చేశారు. దీపికా మాత్రం సహజ గర్భం దాల్చినట్లు నటించి, సరోగసీ పద్దతిలో పిల్లల్ని కనేందుకు ప్లాన్ చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవ్వన్నీ ఊహాగానాలు మాత్రమే. ఎలాంటి అధికారిక సమాచారం లేదు.