Bigg Boss 17: బిగ్ బాస్ 17 టైటిల్ ను మిస్సైన అంకితా లోఖండే.. ఎందుకంటే?

ఈ బిగ్ బాస్ రియాలిటీ షోలో నాల్గవ ఫైనలిస్ట్ గా అంకిత లోఖండే ఎలిమినేట్ అయ్యారు. సీజన్ విజేత మునవ్వర్ ఫరూఖీని ప్రకటించడానికి ముందు ఆమె సెట్స్ నుంచి బయటకు వెళ్లారు.

Written By: Swathi, Updated On : January 29, 2024 6:15 pm
Follow us on

Bigg Boss 17: బాలీవుడ్ బిగ్ బాస్ సీజన్ 17 ముగిసిన సంగతి అందరికీ తెలిసిందే. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహారించిన బిగ్ బాస్ సీజన్ 17 టైటిల్ ను స్టాండప్ కమెడియన్ మునవ్వర్ ఫరూఖీ గెలుచుకున్నారు. కాగా ఈ సీజన్ లో అంకితా లోఖండే, మన్నారా చోప్రా, అభిషేక్ కుమార్, అరుణ్ మాశెట్టి ఫైనల్ గా నిలిచారు.

ఈ బిగ్ బాస్ రియాలిటీ షోలో నాల్గవ ఫైనలిస్ట్ గా అంకిత లోఖండే ఎలిమినేట్ అయ్యారు. సీజన్ విజేత మునవ్వర్ ఫరూఖీని ప్రకటించడానికి ముందు ఆమె సెట్స్ నుంచి బయటకు వెళ్లారు. ఆ సమయంలో మీడియా వారు చుట్టు ముట్టడంతో అంకితా లోఖండే అందరికీ ‘ఆరం సే’ అని చెప్పడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సిల్వర్ కలర్ శారీ ధరించి కనిపించిన అంకితా లోఖండే కాస్త విచారంగా ఉన్నట్లు తెలుస్తోంది.

నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న అంకితా లోఖండే వీడియోను చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఇందులో భాగంగా ఓ నెటిజన్ ఆమె మనసు విరిగిపోయినట్లు కనిపిస్తుందంటూ కామెంట్ చేశారు. మరొకరు అంకితానే బిగ్ బాస్ 17 సీజన్ అసలైన విన్నర్ అంటూ కామెంట్ పెట్టారు.

అయితే ఫైనల్ లో ఎలిమినేషన్ కు గురైన సమయంలో అంకితా లోఖండే కన్నీంటి పర్యంతమైయ్యారు. ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా … ఎలిమినేషన్ కావడంపై ఆశ్చర్యంతో పాటు నిరుత్సాహానికి గురయ్యారని చెప్పుకోవచ్చు. అంతేకాదు బిగ్ బాస్ సీజన్ కు హోస్ట్ గా వ్యవహారించిన సల్మాన్ ఖాన్ సైతం షాక్ గురయ్యారు. 17వ సీజన్ లో అంకితే విజేతగా నిలుస్తుందని తను భావించినట్లు తెలిపారు.

ఫైనలిస్ట్ ను ప్రకటించిన తరువాత బిగ్ బాస్ వేదికపై వెళ్లిన అంకితా లోఖండే మాట్లాడుతూ తాను టైటిల్ ను గెలవనందుకు ఎలాంటి విచారం లేదన్నారు. తన తల్లితో పాటు కుటుంబం అంతా బయట ఎదురు చూస్తోందని చెప్పారు. తానేమీ కోల్పోలేదని వెల్లడించారు. ‘ మెయిన్ టీవీకి బేటీ హన్, యే మేరీ కరమ్ భూమి హై.. మైనే కాఫీ అప్ అండ్ డౌన్స్ దేఖే పర్ మెయిన్ ఖుషీ సే జా రహీ అని వ్యాఖ్యానించారు.