Shakeela : బిగ్ బాస్ లోకి అందుకే తీసుకున్నారు, అవసరం తీరాక బయటకు పంపేశారు… నాగార్జున గుట్టురట్టు చేసిన షకీలా!

Shakeela బిగ్ బాస్ వలన ప్రయోజనం ఆ ఒక్క నాగార్జునకే. ఎందుకంటే ఆయన స్టూడియోలో బిగ్ బాస్ సెట్ ఉంటుంది. అలాగే ఆయన హోస్ట్ గా చేస్తున్నారు...

Written By: S Reddy, Updated On : July 4, 2024 8:17 pm

Shakila

Follow us on

Shakeela : బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ షకీలా లేటెస్ట్ కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్, హోస్ట్ నాగార్జున మీద తీవ్ర ఆరోపణలు చేశారు. షకీలా కామెంట్స్ సరికొత్త చర్చకు దారి తీశాయి. బిగ్ బాస్ తెలుగు 7 గత ఏడాది సెప్టెంబర్ నెలలో 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభం అయ్యింది. ఐదు వారాల తర్వాత మరొక 5 మంది కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్లోకి పంపారు. ఫస్ట్ బ్యాచ్ 14 మందిలో షకీలా ఒకరు. ఆమె హౌస్లో పెద్దగా రాణించలేదు. వయసు రీత్యా షకీలా యాక్టీవ్ గా ఉండేవారు కాదు. 2వ వారమే షకీలాను ఎలిమినేట్ చేశారు.

ఈ రెండు వారాల్లో కంటెస్టెంట్స్ ప్రవర్తన మీద షకీలా ఒక అభిప్రాయానికి వచ్చారు. ఎవరు ఫేక్, ఎవరు జెన్యూన్ వంటి విషయాలు పరోక్షంగా చెప్పారు. తాజా ఇంటర్వ్యూలో షకీలా మాట్లాడుతూ… నాకు హౌస్లో ఆట సందీప్, అమర్ దీప్, ప్రియాంక, దామిని నిజాయితీగా అనిపించారు. వారి కళ్ళలో ఫేక్నెస్ నాకు కనపడలేదు. ఇక శివాజీ న్యూట్రల్. అతడు మంచోడో చెడ్డోడో తెలియదు. వెనుకబడిన కంటెస్టెంట్స్ కి మాత్రం సపోర్ట్ ఇచ్చేవాడు.

పల్లవి ప్రశాంత్ ప్రశాంత్ నాకు నచ్చలేదు. అతని ఫ్యాన్స్ నన్ను ఏం చేసినా నేను లెక్క చేయను. మొదట్లో పిల్లిలా ఉండేవాడు. రాను రాను యాటిట్యూడ్ మార్చేశాడు. పెద్దవాళ్ళు అంటే గౌరవం ఉండేది కాదు. ఆర్టిస్ట్స్ ముందే కాలు మీద కాలేసుకుని కూర్చునేవాడు. వినయంగా నటించి తర్వాత యాటిట్యూడ్ ప్రదర్శించాడు. అతని ప్రవర్తన నాకు అసలు నచ్చలేదు… అని షకీలా అన్నారు.

ఆమె ఇంకా మాట్లాడూతూ… కేవలం పబ్లిసిటీ కోసమే నన్ను తీసుకున్నారు. అవసరం అయిపోయాక ఎలిమినేట్ చేసి పంపేశారు. నాకు బిగ్ బాస్ వలన ఒరిగింది ఏమీ లేదు. పేమెంట్ ఇచ్చారు. అందుకే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాను. బిగ్ బాస్ వలన ప్రయోజనం ఆ ఒక్క నాగార్జునకే. ఎందుకంటే ఆయన స్టూడియోలో బిగ్ బాస్ సెట్ ఉంటుంది. అలాగే ఆయన హోస్ట్ గా చేస్తున్నారు… అని ఘాటైన కామెంట్స్ చేసింది షకీలా. చూస్తుంటే రెండో వారమే తనను ఎలిమినేట్ చేయడం షకీలాకు నచ్చినట్లు లేదు.