Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 8: హౌస్ లో అమ్మాయిలు నన్ను కావాలని నెగటివ్ చేసి ఎలిమినేట్...

Bigg Boss Telugu 8: హౌస్ లో అమ్మాయిలు నన్ను కావాలని నెగటివ్ చేసి ఎలిమినేట్ చేసారు అంటూ సోనియా ఆరోపణలు..ఈమె ఈ జన్మలో మారదేమో!

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ చరిత్ర లో ఇప్పటి వరకు ఈ సీజన్ లో పాల్గొన్న సోనియా రేంజ్ లో ఎవ్వరూ నెగటివిటీ ని సంపాదించలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఎంత నెగటివ్ కంటెస్టెంట్ అయినా ఎలిమినేట్ అయ్యే సమయం లో ‘అయ్యో పాపం’ అని అనిపిస్తాది. కానీ సోనియా హౌస్ నుండి బయటకి వెళ్ళేటప్పుడు కూడా ప్రేక్షకుల చేత తిట్టించుకునేలా చేసింది. శనివారం ఎపిసోడ్ లో సోనియా గేమ్ ని మొత్తం బయటపెట్టేసారు కంటెస్టెంట్స్. నిఖిల్, పృథ్వీ ని చాలా వరకు ప్రభావితం చేసి, వాళ్ళను ఒక ఆయుధాలు లాగా తన తోటి కంటెస్టెంట్స్ మీద సోనియా ఉపయోగిస్తుంది అనేది హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి, షో ని చూసే ఆడియన్స్ కి అనిపించిన విషయం వాస్తవం. అయితే ఇందులో సోనియా తప్పు ఎంతైతే ఉందో, నిఖిల్ -పృథ్వీ తప్పు కూడా అంతే ఉంది. ఆమె హౌస్ లో జరిగే ప్రతీ సంఘటనపై తన అభిప్రాయాన్ని నిఖిల్, పృథ్వీ కి చెప్పి ఉండొచ్చు.

దానికి ప్రభావితం అవ్వాలా, లేదా అనేది వాళ్ళిద్దరి చేతుల్లో ఉంటుంది. కానీ ఇక్కడ సోనియా చేసిన అతి పెద్ద తప్పు ఏంటంటే, తన ఇష్టానికి, తన అభిప్రాయాలకు తగ్గట్టుగా వీళ్లిద్దరు నడుచుకోకపోతే వాళ్ళతో మాట్లాడడం ఆపేయడమో, లేదా వాళ్ళతో గొడవలు పడడమో చేసేది. ఉదాహరణకు ‘సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్’ టాస్కులో యష్మీ ని ఎందుకు తియ్యలేదు?, నేను నీకు హింట్స్ కూడా ఇచ్చాను కదా అని నిఖిల్ తో చాలా పెద్ద గొడవలు పెట్టుకుంది. అంతే కాదు అనేక సందర్భాలలో ఆమె తనకు నచ్చినట్టు నిఖిల్ చేయకపోవడంతో అతని మీద బాగా ఫైర్ అయిన సందర్భాలు ఉన్నాయి. రోజు మనకి టీవీ టెలికాస్ట్ లో చూపించేది గోరంత, కానీ లైవ్ టెలికాస్ట్ లో సోనియా నిజస్వరూపం చూస్తే నాలుగు వారాలు ఆమె హౌస్ లో ఎలా కొనసాగింది?, అసలు ఈమెకు ఓట్లు వేసేవారు మనుషులేనా అనే అభిప్రాయం కలుగుతుంది. బిగ్ బాస్ టీం వాటిని ఎడిటింగ్ నుండి తొలగించాడు. హౌస్ లో నిఖిల్ అంటే అమ్మాయిలకు, అబ్బాయిలకు సమానమైన ఇష్టం ఉంటుంది.

కానీ అతని క్లాన్ లోకి వెళ్ళడానికి ఎవ్వరూ ఇష్టపడలేదంటే అందుకు కారణం సోనియా. హౌస్ లో 24 గంటలు ఆమెని వాళ్ళు దగ్గర నుండి చూసారు కాబట్టి అలా భయపడ్డారు. ఇంత చేసి చివరికి వెళ్ళేటప్పుడు హౌస్ లో ఉన్న లేడీ కంటెస్టెంట్స్ మీద నిందలు వేసి వెళ్ళిపోయింది. హౌస్ లో నిఖిల్, పృథ్వీ అంటే లేడీ కంటెస్టెంట్స్ కి బాగా ఇష్టమట, కానీ వాళ్లిద్దరూ ఎక్కువగా నన్ను ఇష్టపడుతారు కాబట్టి, అసూయతో నాపై లేనిపోనివి కల్పించి జనాలకు ప్రాజెక్ట్ చేశారట, అందుకే ఆమె ఎలిమినేట్ అయ్యిందట. వాళ్ళు ప్రాజెక్ట్ చేస్తే జనాలు ఎలిమినేట్ చేస్తారు అనుకుంటే, మణికంఠ ని రెండవ వారం లోనే ఎలిమినేట్ చేసేవారు, ఎలిమినేట్ అయ్యినప్పుడు గౌరవంగా ప్రేక్షకుల ఓటింగ్ ని అంగీకరించి వెళ్ళాలి, కానీ ఈమె ఆ పని చెయ్యలేదు, ఇక బయటకి వెళ్లిన తర్వాత ఆమె ఎంత నెగటివిటీ ని ఎదురుకుంటుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Exit mobile version