Bigg Boss Telugu 8 : కొత్త చీఫ్ గా కిరాక్ సీత..ఆమె క్లాన్ సభ్యులు వీళ్ళే..ఈ వారం గొడవలు మామూలు రేంజ్ లో ఉండవు!

ఈ వారం నిఖిల్ ఒక్కడే చీఫ్ గా కొనసాగుతాడేమో అని అందరూ అనుకున్నారు. కానీ నేడు జరగబోయే ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ ద్వారా చీఫ్ ని ఎంపిక చేసుకోబోతున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం సీత 'కాంతారా' టీం కి చీఫ్ గా ఎంపిక అయ్యిందట. ఆమె టీం సభ్యులు ప్రేరణ, నబీల్, విష్ణు ప్రియా, ఆదిత్య ఓం, నైనిక. మిగిలిన వారు నిఖిల్ టీం కి వెళ్లిపోయారు.

Written By: Vicky, Updated On : September 24, 2024 8:12 pm

Bigg Boss Telugu 8

Follow us on

Bigg Boss Telugu 8 :  ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో వరుసగా మూడు సార్లు చీఫ్ గా ఎంపికై నిఖిల్ రికార్డు సృష్టించిన సంగతి మన అందరికీ తెలిసిందే. దీంతో సోషల్ మీడియా లో నిఖిల్ ని ఆయన అభిమానులు టాస్క్ కింగ్ అని పిలవడం మొదలు పెట్టారు. ఎంత కష్టమైన టాస్కులో అయినా నిఖిల్ తన సత్తా చాటుతూ ముందుకు దూసుకుపోతున్నాడు. గత వారం లో నిఖిల్ కి పోటీ గా అభయ్ చీఫ్ అయిన సంగతి తెలిసిందే. నిఖిల్ టీం కి శక్తి అని పేరు పెట్టగా, అభయ్ టీం కి కాంతారా అనే పేరు పెట్టుకున్నారు. అయితే కాంతారా టీం చీఫ్ గా అభయ్ టాస్కులు ఓడిపోవడం తో బిగ్ బాస్ అతన్ని చీఫ్ పదవి నుండి తొలగిస్తాడు. దాంతో కాంతారా టీం కి చీఫ్ లేకుండా పోయింది. ఆదివారం ఎపిసోడ్ లో నాగార్జున ఎవరినో ఒకరిని చీఫ్ గా నియమిస్తాడేమో అనుకున్నారు.

కానీ అలా చేయకపోవడం తో ఈ వారం నిఖిల్ ఒక్కడే చీఫ్ గా కొనసాగుతాడేమో అని అందరూ అనుకున్నారు. కానీ నేడు జరగబోయే ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ ద్వారా చీఫ్ ని ఎంపిక చేసుకోబోతున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం సీత ‘కాంతారా’ టీం కి చీఫ్ గా ఎంపిక అయ్యిందట. ఆమె టీం సభ్యులు ప్రేరణ, నబీల్, విష్ణు ప్రియా, ఆదిత్య ఓం, నైనిక. మిగిలిన వారు నిఖిల్ టీం కి వెళ్లిపోయారు. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఇన్ని రోజలు ఒకే టీం లో ఉంటూ ఎంతో స్నేహం గా కలిసి మెలిసి ఉన్న ప్రేరణ, యష్మీ ఇప్పుడు వేర్వేరు టీమ్స్ లో ఉండిపోయారు. వీళ్లిద్దరు టాస్కుల విషయం లో ఎంత సీరియస్ గా ఆడుతారో గత వారం మనమంతా చూసాము. టీం కోసం వీళ్లిద్దరు ప్రాణాలు పెట్టేస్తారు. ఇప్పుడు వీళ్ళు వేరు వేరు టీమ్స్ అవ్వడంతో కచ్చితంగా వీళ్లిద్దరి మధ్య ఎదో ఒక సందర్భంలో గొడవలు జరిగే ప్రమాదం ఉంది.

అలాగే గత వారం మొత్తం ప్రేరణ తో గొడవలు పడుతూ వచ్చిన విష్ణు ప్రియా కూడా సీత టీం లోనే ఉంది. ఇప్పుడు ప్రేరణ, విష్ణు ఒకే టీం కాబట్టి ఇప్పటికైనా వీళ్ళు కలిసిపోతారా?, లేదా గొడవలు పడుతారా అనేది చూడాలి. ఇదంతా పక్కన పెడితే సోనియా, నిఖిల్, పృథ్వీ ఇప్పటికీ ఒకే టీం లో ఉండడం గమనార్హం. ఎవరైనా విడిపోయి వేరు వేరుగా ఆడుతారేమో కానీ, ఈ ముగ్గురు మాత్రం ఎప్పటికీ కలిసే ఉంటారేమో. వీళ్ళకి తోడుగా మణికంఠ కూడా ఇప్పుడు వీళ్లకు కలిసాడు. మణికంఠ నిఖిల్ కి అలాగే సోనియా కి బాగా క్లోజ్ అనే సంగతి మనకి తెలిసిందే. గొడవలు బీభత్సంగా జరిగేందుకు ఈ వారం చాలా స్కోప్ ఉంది. ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ తిరుగు ఉండదు అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.