Shivaji: రాముడు అయోధ్యలోనే ఉంటాడా? కరోనాకు మించిన రోగాలు వస్తాయి… శివాజీ సెన్సేషనల్ కామెంట్స్

చాలా కాలంగా యాక్టింగ్ కి దూరంగా ఉంటున్న శివాజీ బిగ్ బాస్ ద్వారా మళ్లీ వెలుగులోకి వచ్చాడు. తనదైన శైలిలో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఫినాలే వరకు చేరుకొని మూడవ స్థానంలో నిలిచాడు.

Written By: NARESH, Updated On : January 18, 2024 8:25 pm

Bigg Boss Shivaji

Follow us on

Shivaji: బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ శివాజీ తన గేమ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. బిగ్ బాస్ షో ముగిసి దాదాపు నెల రోజులు అవుతున్నా శివాజీ మాత్రం ఏదో ఒక విధంగా వార్తల్లో ఉంటున్నాడు. హౌస్ నుంచి బయటకు వచ్చిన శివాజీ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు. పలు అంశాలపై స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ అవుతున్నాడు. తాజాగా శివాజీ అయోధ్య రామ మందిరాన్ని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

చాలా కాలంగా యాక్టింగ్ కి దూరంగా ఉంటున్న శివాజీ బిగ్ బాస్ ద్వారా మళ్లీ వెలుగులోకి వచ్చాడు. తనదైన శైలిలో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఫినాలే వరకు చేరుకొని మూడవ స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ బిజీ గా ఉంటున్నాడు. అయితే శివాజీ బీజేపీ రాజకీయ పార్టీలను విమర్శిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ప్రస్తుతం అయోధ్యలో రామ మందిరం నిర్మాణం పూర్తి అయింది. ప్రాణ ప్రతిష్ట కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

శివాజీ అయోధ్యలో రామ మందిర ప్రారంభ కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ చేస్తున్న పొలిటికల్ ప్రోపగాండా గా అభివర్ణించాడు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం రామ మందిరం అంశం తెరపైకి తెచ్చారు అనే అర్థంలో మాట్లాడాడు. రాముడు అయోధ్యలో మాత్రమే ఉంటాడా? అయోధ్యలో ఉన్నదే రామ మందిరమా? అని శివాజీ ప్రశ్నించాడు. మా ఊళ్ళో కూడా రామ మందిరం ఉంది. అది అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.

మనుషుల్లో క్రూరత్వం, డబ్బు పిచ్చి ఎక్కువైంది. అయితే ప్రకృతి మనిషి కంటే గొప్పది. అది అందరి దూల తీర్చేస్తుంది, అన్నాడు. భవిష్యత్ లో కరోనా కంటే దారుణమైన వ్యాధులు వ్యాపిస్తాయి. మనిషి అదుపు తప్పినప్పుడు, దేవుడు, ప్రకృతి బ్యాలన్స్ చేస్తారు. జనాల తప్పులు సరి చేస్తారని శివాజీ మాట్లాడారు. శివాజీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక నటుడిగా శివాజీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు.