BigBoss: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానే అలరిస్తోన్న హాట్ రియాలిటీ గేమ్ షో బిగ్బాస్ సీజన్ 5 ఈ వారంతో ముగియనుంది. ఎప్పుడో తొలి సీజన్తో ప్రారంభమై.. అంతులేని ప్రేక్షకాదరణ పొందింది ఈ షో. అప్పటి వరకు ఎవ్వరికీ తెలియని వాళ్లను కూడా స్టార్లను చేసి ఓ స్థాయిలో కూర్చోబెట్టింది. కాగా, డిసెంబరు 19న జరిగే ఈ సీజన్ ఫైనల్కు నిర్వహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని రీతిలో ఈ ఫైనల్ను నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ ఎపిసోడ్కు రాజమౌళి అండ్ ఆర్ఆర్ఆర్ టీమ్ను ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తున్నట్లు గతంలో ప్రచారం నడిచింది. అయితే, ఇప్పుడు మరో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సారి ఏకంగా బాలీవుడ్ తారలను దింపనున్నట్లు సమాచారం.
గతేడాది బిగ్బాస్ ఫైనల్కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి ట్రోఫీని అందించారు. ఈ ఏడాది మాత్రం బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణెలతో పాటు ఆర్ఆర్ఆర్లో నటించిన రామ్చరణ్, అలియాభట్ జంటను నిర్వహకులు అతిథులుగా ఆహ్వానించినట్లు సమాచారం.
కాగా, టాప్ 5లో వీజే సన్నీ, షణ్ముఖ్ జశ్వంత్, సిరిస మానస్, శ్రీరామ్ ఉన్నారు. వీరిలో విజేతగా నిలిచేది ఎవరో తెలియాలంటే వచ్చే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే. కాగా, సోషల్మీడియాలో మాత్రం సన్నీయే ఈ టైటిల్ విన్నర్ అంటూ తెగ ప్రచారం నడుస్తోంది. మరి విజేత ఎవరో తెలుసుకోవాలంటే కాస్త టైమ్ పడుతుంది మరి. అప్పటి వరకు ఈ ఎగ్సైట్మెంట్తోనే ఉండంది.