Akkineni AKhil: అక్కినేని అఖిల్ కి ఇప్పుడు మంచి టైమ్ నడుస్తుందని చెప్పాలి. ఇటీవల ఆయన నటించిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమా మంచి విజయం సాధించింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా… బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఎప్పటి నుంచో సరైన సక్సెస్ లేక బాధ పడుతున్న అఖిల్ కి ఈ మూవీ సక్సెస్ తో పాటు కలెక్షన్ల పరంగా కూడా ఓ పెద్ద గిఫ్ట్ ని ఇచ్చిందని చెప్పాలి. దీంతో చకచక తన తదుపరి చిత్రాలను పూర్తిచేసే పనిలో పడ్డారు అయ్యగారు. ఇక ప్రస్తుతం ఈ యంగ్ హీరో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో “ఏజెంట్” అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఏజెంట్ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తుండగా.. కీలక పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తున్నారు. ఇక ఈ సినిమాతో మరో హిట్ అందుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు అఖిల్. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాలో అఖిల్ సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తాజా షెడ్యూల్ షూటింగ్ ఇటీవలే బుడాపెస్ట్లో నిర్వహించారు. ఇక తదుపరి షెడ్యూల్ను హైదరాబాద్లో త్వరలోనే ప్రారంభించనున్నారు. కాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ నటించనున్నట్లుగా తెలుస్తోంది.
ఇందులో సెకండ్ హీరోయిన్ పాత్రకు తమిళ ముద్దుగుమ్మ “అతుల్య రవి”ని తీసుకునేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారంట. ఈ మేయర్కు త్వరలోనే అధికారికంగా ప్రకటన కూడా వెలువడనుందని సమాచారం అందుతుంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండడం మరో హైలైట్ అని చెప్పాలి.