Sai Dharamtej: దీపావళికి మెగా గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి… ఆ ఫోటోలో సాయి ధరమ్ తేజ్ ఎలా ఉన్నాడంటే ?

Sai Dharamtej: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ కు గురై హాస్పిటల్ లో చేరిన విషయం అందరికీ తెలిసిందే.  దాదాపు నెల రోజులకు పైగా అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు తేజ్. కొద్ది రోజుల క్రితం తాను కోలుకుంటున్నట్టు స్వయంగా తెలియ జేస్తూ, థంబ్ సింబల్‌తో ట్వీట్ చేసి అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పారు సాయి ధరమ్ తేజ్. అయితే ఇప్పుడు తాజాగా దీపావళి కానుకగా మెగా స్టార్ చిరంజీవి మెగా […]

Written By: Raghava Rao Gara, Updated On : November 5, 2021 9:36 pm
Follow us on

Sai Dharamtej: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ కు గురై హాస్పిటల్ లో చేరిన విషయం అందరికీ తెలిసిందే.  దాదాపు నెల రోజులకు పైగా అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు తేజ్. కొద్ది రోజుల క్రితం తాను కోలుకుంటున్నట్టు స్వయంగా తెలియ జేస్తూ, థంబ్ సింబల్‌తో ట్వీట్ చేసి అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పారు సాయి ధరమ్ తేజ్. అయితే ఇప్పుడు తాజాగా దీపావళి కానుకగా మెగా స్టార్ చిరంజీవి మెగా అభిమానులందరికి ఓ సర్ ప్రైజ్ ను వెల్లడించారు.

ఈ మేరకు సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకొని మెగా ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫోటోని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ సంధర్భంగా “అందరి ఆశీస్సులు దీవెనలు ఫలించి సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నాడు. మా కుటుంబ సభ్యులందరికి ఇది నిజమైన పండుగ అని పోస్ట్ లో రాశారు. ఈ ఫోటోలో సాయి ధరమ్ తేజ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి, మెగా బ్రదర్ నాగబాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అఖిరా నందన్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ వార్తతో మెగా అభిమానుల్లో మరింత జోష్ నెలకొంది.