Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జునకు, ఆయన అన్నకి మధ్య నిజంగానే మాటలు లేవా? ఆస్తులే కారణమా?

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున కు తన అన్న అక్కినేని వెంకట్ కు మధ్య ఆస్తి విషయంలో తగాదాలు వచ్చాయని, ఇద్దరి మధ్య కనీసం మాటలు కూడా లేవు అంటూ ఎప్పటి నుంచో ఓ వార్త నెట్టింట చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.

Written By: Velishala Suresh, Updated On : November 14, 2023 5:08 pm

Akkineni Nagarjuna

Follow us on

Akkineni Nagarjuna: ఆస్తి విషయంలో ఎంత మంచి అన్నదమ్ములు అయినా అక్కచెల్లెల్లు అయినా గొడవలు పడుతుంటారు. ఇలాంటి విషయాలు మధ్యతరగతి కుటుంబాలలో మాత్రమే కాదు ధనవంతుల కుటుంబాలలో కూడా జరుగుతాయి. అంతే కాదు సినీ సెలబ్రెటీల కుటుంబాలలో కూడా ఇలాంటి విషయాల్లో గొడవలు వస్తుంటాయి. కానీ అలాంటి విషయాలను బయటకు రానివ్వరు సెలబ్రెటీలు. ఈ గొడవ అక్కినేని నాగార్జున వరకు కూడా పాకిందట. ఇంతకీ ఈ కుటుంబంలో ఎవరి మధ్య గొడవ మొదలు అయింది అనుకుంటున్నారా?

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున కు తన అన్న అక్కినేని వెంకట్ కు మధ్య ఆస్తి విషయంలో తగాదాలు వచ్చాయని, ఇద్దరి మధ్య కనీసం మాటలు కూడా లేవు అంటూ ఎప్పటి నుంచో ఓ వార్త నెట్టింట చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అయితే అక్కినేని నాగేశ్వరరావు కు నాగార్జున ఒక్కడే కొడుకు అని అనుకుంటారు. కానీ నాగార్జునకు వెంకట్ అనే అన్నయ్య కూడా ఉన్నారు. ఈయన ఇండస్ట్రీలో నిర్మాతగా రాణిస్తున్నారు. ఇక నాగార్జున సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఫేమస్ అయ్యారు కాబట్టి ఈయన అందరికీ తెలుసు.

గత కొద్ది రోజులుగా వీరి మధ్య మాటలు లేవని, ఆస్తి విషయంలో గొడవలు పడ్డారని టాక్. అయితే ఈ విషయంపై అక్కినేని వెంకట్ రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ వచ్చేసింది. వీరిద్దరు అక్కినేని నాగేశ్వరరావు ముందు ఏ రోజు కూడా మాటైనా మాట్లాడేవారు కాదట. ఏదైనా మాట్లాడితే చాలా భయపడేవారట. ఒక రోజు వెంకట్ ధైర్యం చేసుకొని నాన్న.. నాగార్జునను హీరో చేద్దాం అన్నారట. దానికి నాగేశ్వర రావు కూడా ఒకే చెప్పారట. దీని గురించి మాట్లాడుతూనే నాగార్జునకు నాకు మధ్య ఏ గొడవలు లేవని తెలిపారు.

మా మధ్య ఆస్తి గొడవలు ఉన్నాయని, మేము మాట్లాడుకోవడం లేదని వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు వెంకట్. అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలు అన్నీ కూడా నాగార్జునే చూసుకుంటున్నారని వెంకట్ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు జనరేషన్ గ్యాప్ వస్తుందని సినిమాలు నిర్మించడం కూడా మానేశారట. మొత్తం మీద వీరిద్దరి మధ్య మాటలు లేవని, ఆస్తుల కోసం గొడవలు జరిగాయనే వార్తలకు పులిస్టాప్ పడినట్టుగా అయింది.