అతడి వల్లే సినిమాల్లో నటిస్తున్నానంటున్న అనుష్క…?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు వచ్చినా అనుష్కకు మాత్రం ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. స్టార్ హీరోలతో కలిసి ఆడిపాడిన అనుష్క అరుంధతి సినిమా తరువాత అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ గ్లామర్ పాత్రలకు పూర్తిగా దూరమైంది. అక్టోబర్ నెల 2వ తేదీన నిశ్శబ్దం సినిమా ద్వారా అనుష్క ప్రేక్షకులను పలకరించనుంది. Also Read : అదే హీరో నాని సినిమాలు ఆడకపోవడానికి కారణమా? ఈ సినిమాలో మాధవన్ హీరోగా అనుష్క హీరోయిన్ గా […]

Written By: Navya, Updated On : October 1, 2020 2:55 pm
Follow us on

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు వచ్చినా అనుష్కకు మాత్రం ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. స్టార్ హీరోలతో కలిసి ఆడిపాడిన అనుష్క అరుంధతి సినిమా తరువాత అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ గ్లామర్ పాత్రలకు పూర్తిగా దూరమైంది. అక్టోబర్ నెల 2వ తేదీన నిశ్శబ్దం సినిమా ద్వారా అనుష్క ప్రేక్షకులను పలకరించనుంది.

Also Read : అదే హీరో నాని సినిమాలు ఆడకపోవడానికి కారణమా?

ఈ సినిమాలో మాధవన్ హీరోగా అనుష్క హీరోయిన్ గా నటిస్తుండగా అనుష్క మూగ పాత్రలో కనిపిస్తూ ఉండటం గమనార్హం. నిజానికి చాలా నెలల క్రితమే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా, లాక్ డౌన్ వల్ల వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల కావడానికి సిద్దం కావడం గమనార్హం. భాగమతి సినిమా తరువాత నిశ్శబ్దం కథ విన్నానని ఈ కథ తనకు ఎంతగానో నచ్చిందని అనుష్క చెప్పారు.

దీంతో భాగమతి తర్వాత కొన్ని నెలల పాటు షూటింగ్ లకు దూరంగా ఉండాలని తీసుకున్న నిర్ణయాన్ని సైతం మార్చుకున్నాన్నని అనుష్క చెప్పారు. దర్శకుడు హేమంత్ మధుకర్ తాను సినిమాల్లో మళ్లీ నటించడానికి కారణమని వెల్లడించారు. ఛాలెంజింగ్ రోల్ అయినప్పటికీ కథ, కథనంగా అద్భుతంగా ఉండటంతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని పేర్కొన్నారు. మూగ యువతి పాత్రలో నటించడం కోసం శిక్షణ తీసుకున్నానని చెప్పారు.

మూగ యువతి పాత్రకు సంబంధించి సైగలు నేర్చుకోవడానికి రెండు నెలల సమయం పట్టిందని వెల్లడించారు. తనపైనే సినిమా విజయానికి సంబంధించిన భారం ఉందనే మాట ఒకవైపు ఆనందంగానే ఉన్నా ఈ సినిమాలో చాలా బలమైన పాత్రలు ఉన్నాయని ప్రతి పాత్రను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారని అనుష్క తెలిపారు.

Also Read : ట్రోలింగ్‌ కు హర్ట్ అయిన హాట్ బ్యూటీ !