రాంగోపాల్ వర్మ మరో అస్త్రం: జగన్ టార్గెట్

రాంగోపాల్ వర్మ.. వివాదాలు లేనిదే పూటగడవని ఈ వివాదాస్పద దర్శకుడు ఏపీ రాజకీయాలపై మరో అస్త్రాన్ని సంధించబోతున్నాడు. ఈసారి ఆయన టార్గెట్ సీఎం జగన్ కావడం విశేషం. జగన్ అంటే అభిమానించే రాంగోపాల్ వర్మ ఆయనపై సినిమా తీస్తున్నాడు. అయితే అది నెగెటివ్ గా కాదు.. పాజిటివ్ గానే.. ఏది మొదలుపెట్టినా బోలెడు వివాదాలను కొనితెచ్చుకున్న ఈ దర్శకుడు ఈసారి తీయబోయే సినిమాతో మరెన్ని వివాదాలు సృష్టిస్తాడోనన్న ఆసక్తి ఏపీ రాజకీయవర్గాల్లో.. సినీ ఇండస్ట్రీలో ఉంది. వర్మ […]

Written By: NARESH, Updated On : April 14, 2021 8:44 am
Follow us on

రాంగోపాల్ వర్మ.. వివాదాలు లేనిదే పూటగడవని ఈ వివాదాస్పద దర్శకుడు ఏపీ రాజకీయాలపై మరో అస్త్రాన్ని సంధించబోతున్నాడు. ఈసారి ఆయన టార్గెట్ సీఎం జగన్ కావడం విశేషం. జగన్ అంటే అభిమానించే రాంగోపాల్ వర్మ ఆయనపై సినిమా తీస్తున్నాడు. అయితే అది నెగెటివ్ గా కాదు.. పాజిటివ్ గానే.. ఏది మొదలుపెట్టినా బోలెడు వివాదాలను కొనితెచ్చుకున్న ఈ దర్శకుడు ఈసారి తీయబోయే సినిమాతో మరెన్ని వివాదాలు సృష్టిస్తాడోనన్న ఆసక్తి ఏపీ రాజకీయవర్గాల్లో.. సినీ ఇండస్ట్రీలో ఉంది.

వర్మ తీసే సినిమాలు సంచలనాలకు మారుపేరుగా ఉంటాయి. సమాజంలో జరిగే నిజజీవిత కథలను ఆయన తెరకెక్కిస్తుంటారు. ఇప్పటికే బోలెడు బయోపిక్ లు ఆయన తీశాడు.ఇప్పుడు జగన్ పై కూడా సినిమా తీయడానికి రెడీ అయ్యాడు.

ఇప్పటికే ఏపీ రాజకీయాలపై వర్మ ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ , రక్త చరిత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్ , వంగవీటి, పవర్ స్టార్ లాంటి చిత్రాలను తెరకెక్కించాడు. అవి సరిగా ఆడకపోయినా కూడా ఏపీ రాజకీయాలను వర్మ వదలడం లేదు.

ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ పై సినిమా తీస్తానని ప్రకటించిన వర్మ.. ఆ ప్రాజెక్ట్ ను పక్కనపెట్టి తాజాగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కథాంశాన్ని తీసుకొని సినిమా తీసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు ‘జగమొండి’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు సమాచారం.ఇందులో జగన్ ను పాజిటివ్ గా చూపిస్తారా? నెగెటివ్ గానే ఏపీ రాజకీయాల్లో దీని ప్రభావం ఏంటనేది వేచిచూడాలి.