ప్రభాస్-నాగ్ అశ్విన్ మూవీపై మరో ఆసక్తికర అప్డేట్

  టాలీవుడ్ నుంచి ప్రభాస్ ‘బాహుబలి’తో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఆయనతో సినిమాలు చేసేందుకు దర్శకులు క్యూలో ఉన్నారు. ఇప్పటికే ‘సలార్’తో ప్రశాంత్ నీల్, హిందీలో ఓంరౌత్ ‘ఆదిపురుష్’ సినిమాలు ప్రభాస్ చేస్తున్నారు. తాజాగా ‘ప్రాజెక్ట్ కే’ పేరుతో దర్శకుడు నాగ్ అశ్విన్ చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నాడు. ఇందులో అమితాబ్ బచ్చన్, దీపిక పడుకొనే లాంటి స్టార్ నటీనటులు నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం ప్రారంభమైంది. అయితే బాహుబలి లాగానే ఈ చిత్రం మొత్తాన్ని […]

Written By: NARESH, Updated On : July 28, 2021 9:50 am
Follow us on

 

టాలీవుడ్ నుంచి ప్రభాస్ ‘బాహుబలి’తో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఆయనతో సినిమాలు చేసేందుకు దర్శకులు క్యూలో ఉన్నారు. ఇప్పటికే ‘సలార్’తో ప్రశాంత్ నీల్, హిందీలో ఓంరౌత్ ‘ఆదిపురుష్’ సినిమాలు ప్రభాస్ చేస్తున్నారు.

తాజాగా ‘ప్రాజెక్ట్ కే’ పేరుతో దర్శకుడు నాగ్ అశ్విన్ చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నాడు. ఇందులో అమితాబ్ బచ్చన్, దీపిక పడుకొనే లాంటి స్టార్ నటీనటులు నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం ప్రారంభమైంది.

అయితే బాహుబలి లాగానే ఈ చిత్రం మొత్తాన్ని దాదాపు 90శాతం షూటింగ్ హైదరాబాద్ లో ఉన్న ‘రామోజీ ఫిల్మ్ సిటీలోనే’ చేయడానికి నాగ్ అశ్విన్ రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు ఫిల్మ్ సిటీలోని రెండు హోటల్స్ లో ప్రభాస్, అమితాబ్, దీపిక కోసం బుక్ చేసినట్టు సమాచారం.

‘టైం మిషన్’ కథ నేపథ్యంలో నాగ్ అశ్విన్ ఈ సినిమా తీస్తున్నారు. బాహుబలి సైతం 70శాతం రామోజీ ఫిల్మ్ సిటీలోనే తీశారు. గ్రాఫిక్స్ తో సినిమాను విడుదల చేశారు. ఇప్పుడు నాగ్ అశ్విన్ కూడా అందుబాటులో ఉన్న ‘ఫిల్మ్ సిటీ’నే వినియోగిస్తుండడం విశేషంగా మారింది.