Anchor Anasuya: సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే యాంకర్ అనసూయ , తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా , ముక్కు సూటితనం మనస్తత్వం తో ఎలా మాట్లాడుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా తప్పుగా మాట్లాడినట్టు అనిపిస్తే , మొహమాటం లేకుండా వాళ్ళని ప్రశ్నిస్తుంది , నిలదీస్తుంది. ఆ కారణం చేత ఆమె తీవ్రమైన నెగెటివిటీ ని ఎదురుకోవాల్సి వచ్చింది. రీసెంట్ గా ‘పెద్ది’ వివాదం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లో డైరెక్టర్ బుచ్చి బాబు హీరోయిన్ ని చూపించిన విధానం పై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి, ఒక అమ్మాయిని ఇంత దారుణంగా చూపిస్తారా?, అమ్మాయిల మీద మీకు ఉన్నటువంటి గౌరవం ఇదేనా ? అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. బుచ్చి బాబు క్షమాపణలు కూడా చెప్పాడు. ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సన్నివేశాలను సినిమా నుండి తొలగిస్తున్నాము అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ అంశంపై యాంకర్ అనసూయ కూడా రెస్పాన్స్ వచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘సినిమా అనేది చాలా శక్తివంతమైన మాధ్యమం , కానీ సమాజం లో జరిగే ప్రతీ ఒక్కటి సినిమా ప్రభావితం చేస్తుంది అనడం కరెక్ట్ కాదు. సినిమా మంచిని చూపిస్తుంది చెడు ని కూడా చూపిస్తుంది , ఏది తీసుకోవాలి అనేది ప్రేక్షకుడి విచక్షణ పైనే ఉంటుంది. సినిమాలు చూసి పిల్లలు చెడిపోతున్నారు అనడం సరికాదు. క్రియేటివ్ రంగం లో దర్శకుడికి తాను చెప్పాలనుకున్న కథని చెప్పే స్వేచ్ఛ ఉండాలి. అదే సమయం లో సమాజం పట్ల బాధ్యత కూడా ఉండాలి, ఇకనైనా క్రియేటర్లు బాధ్యతతో వ్యవహరించి సినిమాలను తెరకెక్కిస్తారని భావిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. ‘పెద్ది’ చిత్రం లో హీరోయిన్ ని చూపించిన విధానం ని చూసి పిల్లలు ఏమి నేర్చుకోవాలి అనే చర్చ కి అనసూయ ఇచ్చిన సమాధానం ఇది.
ఒకపక్క పిల్లలు సినిమాల కారణంగా చెడిపోతారు అనడం కరెక్ట్ కాదు అంటూనే , డైరెక్టర్లు కూడా కాస్త బాధ్యత తో సినిమాలు తీయాల్సిన అవసరం ఉందంటూ బుచ్చి బాబు పై సైలెంట్ గా కౌంటర్ వేసింది. అనసూయ మాట్లాడిన ఈ మాటలను సామర్దించే వాళ్ళు ఉన్నారు , విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. సోషల్ మీడియా లో ఆమెకు తీవ్రమైన నెగెటివిటీ ఉంటుంది కాబట్టి, విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ‘జబర్దస్త్’ పదేళ్లకు పైగా పని చేశావు , ఆ కామెడీ షో లో మొత్తం డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి , అలాంటి షో కి యాంకర్ గా చేసి , నువ్వు కూడా ఎన్నో డబుల్ మీనింగ్ డైలాగ్స్ కొట్టి , ఇప్పుడొచ్చి నీతులు చెప్తున్నావు , నీకు లేదా సమాజం మీద బాధ్యత ?, కేవలం డైరెక్టర్స్ కి మాత్రమే ఉండాలా ? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
