తాజాగా.. తనకు సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో ఫ్రాక్ వేసుకున్న అనసూయ థైస్ కనిపించేలా ఎక్స్ పోజ్ చేసింది. రెండు జడలు వేసుకొని.. అందాలను ప్రదర్శించింది.
దీనిపై నెటిజన్లు సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. స్కూల్ బ్యాగ్ తక్కువైనట్టుందని కొందరు కామెంట్ చేశారు. ఓ నెటిజన్ మాత్రం తన కోపాన్ని అణుచుకోలేకపోయాడు. ‘‘అసలే కరోనా కేసులు దారుణంగా పెరిగిపోతున్నాయి. వేలాది మంది ప్రాణాలు పోతున్నాయి. దీని గురించి నీకు కాస్తకూడా బాధలేదా? ఇలాంటి సమయంలో ఈ ఫొటోలు ఎలా పెట్టాలనిపించింది? అసలు.. ఇప్పుడు ఈ ఫొటోలు పోస్ట్ చేయడం అంత అవసరమా?’’ అని కామెంట్ చేశాడు.
ఈ కామెంట్ చేసిన నెటిజన్ కు పలువురు మద్దతు తెలుపుతున్నారు. అయితే.. దీనికి రిప్లే ఇచ్చింది అనసూయ. ఇలాంటి పరిస్థితుల్లో జనాలకు కాస్త వినోదం, మరికాస్త నమ్మకాన్ని కలిగించడానికే తాము ఈ విధంగా ప్రయత్నిస్తున్నామని చెప్పుకురావడం గమనార్హం.