Anasuya Bharadwaj : యాంకర్ అనసూయ తీరిక లేని కెరీర్ అనుభవిస్తున్నారు. ఆమెకు ఫుల్ డిమాండ్ ఉన్న నేపథ్యంలో వరుస ఆఫర్స్ దక్కుతున్నాయి. రోజుల వ్యవధిలో అనసూయ నటించిన రంగమార్తాండ, విమానం చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాల్లో అనసూయ రోల్ చాలా కీలకం. విమానం చిత్రంలో అయితే ఏకంగా వేష పాత్ర చేసింది. వెయ్యి రూపాయలకు శరీరాన్ని అమ్ముకునే స్లమ్ ఏరియా మహిళగా బోల్డ్ రోల్ లో ఆకట్టుకున్నారు. ఎలాంటి పాత్రలకైనా అనసూయ చక్కగా సరిపోతుంది. అది ఆమెకు ప్లస్ అవుతుంది.
కాగా ఆమె లేటెస్ట్ ప్రాజెక్ట్ షూటింగ్ జరుపుకుంటుంది. రాత్రివేళ ఈ షూటింగ్ చేస్తున్నారట. అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో మొదలైన చిత్రీకరణ తెల్లవారుజామున నాలుగు గంటల వరకూ సాగిందట. ఈ విషయాన్ని అనసూయ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. రాత్రంతా షూటింగ్ చేసి అలసిపోయానని నీరసంగా ఉన్న ఫోటో షేర్ చేసింది. అనసూయ సోషల్ మీడియా పోస్ట్స్ చూసిన అభిమానులు.. ఆమె చాలా డెడికేటెడ్ అంటున్నారు.
అనసూయ మొండిఘటం. ఎంత కష్టానికైనా వెనుకాడదు. ఇక అనసూయ చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్ పుష్ప 2. అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఆమె నెగిటివ్ రోల్ చేస్తుంది. దాక్షాయణిగా డీ గ్లామర్ లుక్ లో అలరించనుంది. పుష్ప 2 డిసెంబర్ నెలలో విడుదలయ్యే అవకాశం కలదు.
కెరీర్ సక్సెస్ఫుల్ గా సాగుతుండగా అనసూయ అనవసర వివాదాల్లో తలదూర్చుతుంది. విజయ్ దేవరకొండను ఆమె పదే పదే టార్గెట్ చేసింది. అందుకు కారణాన్ని అనసూయ ఇటీవల బయటపెట్టింది. విజయ్ దేవరకొండ దగ్గర పనిచేసే ఓ వ్యక్తి డబ్బులిచ్చి తనను ట్రోల్ చేయిస్తున్నారని తెలిసింది. అప్పటి నుండి విజయ్ దేవరకొండ మీద నేను పగ పెంచుకున్నాను అంటూ అనసూయ షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఈ వివాదానికి ఇకపై ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు వెల్లడించారు.