Homeఎంటర్టైన్మెంట్Allu sirish: సోషల్​ మీడియాకు గుడ్​బై చెప్పిన అల్లు శిరీష్.. కారణం ఇదే!

Allu sirish: సోషల్​ మీడియాకు గుడ్​బై చెప్పిన అల్లు శిరీష్.. కారణం ఇదే!

Allu sirish: అల్లు కుటుంబం నుంచి వచ్చి.. తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న హీరోల్లో ఒకరు అల్లు శిరీష్​. అయితే, తాజాగా, ఈ హీరో అభిమానులకు షాకింగ్​ న్యూస్​ ప్రకటించారు. సోషల్​ మీడియాకు గుడ్​బై చెప్పబోతున్నట్లు తెలిపారు. ఈ మధ్య కాలంలో శిరీష్​ పెద్దగా సోషల్​ మీడియాలో యాక్టీవ్​గా కనిపించడంలేదు. అయితే, తాడాగా, లైన్​లోకి వచ్చి సామాజిక మాద్యమాలకు గుడ్​బై చెబుతున్నట్లు తెలిపారు. ఇది తనకు చాలా స్పెషల్​డేగా వర్ణిస్తూ లాస్ట్ ట్వీట్​ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్​ వైరల్​గా మారింది.

allu-shirish-said-good-bye-to-his-twitter-account-you-know-the-reason

ట్వీట్​లో ఈ ఏడాది నవంబరు 11వ తేదీ నాకు చాలా స్పెషల్​. వృత్తి పరంగా నా జీవితంలో మర్చిపోలేని రోజు. త్వరలోనే విషయం ఏంటనేది క్లారిటీ ఇస్తా. అప్పటి వరకు కొన్ని కారణాల వల్ల సోషల్​ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నా అంటూ  పోస్ట్ చేశారు. ఈ ట్వీట్​ చూసిన అభిమానులు పెళ్లి ఏమైనా కుదిరిందా అని అడిగారు. అందుకు సమాధానంగా.. నేను వృత్తిపరంగా స్పెషల్​ డే అన్నాను. అంటూ రిప్లై ఇచ్చారు శిరీష్​. మరో నెటిజన్​ ఒకరు హాలీవుడ్​ ఏమైనా వెళ్తున్నారా అని అడగ్గా.. అలాంటి ఆశలేమీ లేవు.. కొత్త సినిమా కుదిరింది.. కథ కూడా బాగా నచ్చింది. నా కెరీర్​లో బెస్ట్​ స్క్రిప్ట్​ అవుతుందనిపిస్తోంది. అంటూ మిస్టరీని రివీల్ చేశారు.  ప్రస్తుతం అల్లు శిరీష్​ ప్రేమ కాదంట అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం సిక్స్​ ప్యాక్​ పెంచేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు అల్లు శిరీష్​.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular