అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అల్లు బ్రదర్స్

టాలీవుడ్ గర్వించే కమెడియన్ అల్లు రామలింగయ్య.. ఆయన శతజయంతి సందర్భంగా అల్లూ ఫ్యామిలీ సంబరాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ‘అల్లూ స్టూడిడియోస్ లో ఆయన కాంస్య విగ్రహాన్ని తాజాగా ఏర్పాటు చేశారు. దీన్ని ఆయన మనవళ్లు అయిన స్టార్ హీరో అల్లు అర్జున్, ఆయన సోదరులు శిరీష్, బాబీలు కలిసి ఆవిష్కరించారు. అల్లు కుటుంబానికి హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన కోకాపేట్ ప్రాంతంలో భూమి ఉంది. అక్కడ గత సంవత్సరం ‘అల్లూ స్డూడియోస్’ నిర్మాణానికి సన్నాహాలు చేశారు. […]

Written By: NARESH, Updated On : October 1, 2021 11:38 am
Follow us on

టాలీవుడ్ గర్వించే కమెడియన్ అల్లు రామలింగయ్య.. ఆయన శతజయంతి సందర్భంగా అల్లూ ఫ్యామిలీ సంబరాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ‘అల్లూ స్టూడిడియోస్ లో ఆయన కాంస్య విగ్రహాన్ని తాజాగా ఏర్పాటు చేశారు. దీన్ని ఆయన మనవళ్లు అయిన స్టార్ హీరో అల్లు అర్జున్, ఆయన సోదరులు శిరీష్, బాబీలు కలిసి ఆవిష్కరించారు.

అల్లు కుటుంబానికి హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన కోకాపేట్ ప్రాంతంలో భూమి ఉంది. అక్కడ గత సంవత్సరం ‘అల్లూ స్డూడియోస్’ నిర్మాణానికి సన్నాహాలు చేశారు. ఇప్పటికే శంకుస్థాపన కార్యక్రమం పూర్తికాగా.. నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

ఈరోజు అల్లు రామలింగయ్య శతజయంతి సందర్భంగా అల్లు అర్జున తన సోదరులతో కలిసి తాత అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.

మెగాస్టార్ చిరంజీవి ఈరోజు రాజమండ్రి దగ్గరలోని ‘అల్లు హోమియోపతి ఆస్పత్రిలో’ కూడా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్లారు. అక్కడ అల్లు అరవింద్ తో కలిసి పాల్గొంటున్నారు.

అల్లు బ్రదర్స్ ఈ విగ్రహావిష్కరణ అనంతరం ఈవెంట్ లో పాల్గొన్న ఫొటోలను మీడియాతో పంచుకున్నారు. ‘ఆయన మా గర్వం. అల్లు స్టూడియోస్ లో మా ప్రయాణంలో భాగం అవుతారు’ అని అల్లు అర్జున్ చెప్పారు.