Homeఎంటర్టైన్మెంట్Allu Arjun: విశాఖకు ‘మెగా’ హీరోలు.. పది రోజులు సందడే సందడి..

Allu Arjun: విశాఖకు ‘మెగా’ హీరోలు.. పది రోజులు సందడే సందడి..

Allu Arjun: మెగా కాంపౌండ్‌కు చెందిన ఇద్దర స్టార్‌ హీరోలు విశాఖకు కొద్ది రోజుల వ్యవధిలో అక్కడి వెళ్లడంతో విశాఖలో సందడి నెలకొంది. అల్లు అర్జున్, రామ్‌చరణ్‌ విశాఖ చేరుకుంటున్నారు. ఇప్పటికే బన్నీ విశాఖలో ల్యాండ్‌ అయ్యాడు. చరణ్‌ మరికొన్ని రోజుల్లో వైజాగ్‌ రానున్నారు. వరుసగా మెగా స్టార్లు విశాఖకు రానుండడంతో ఫ్యాన్స్‌ సంబుర పడుతున్నారు. అయితే వీళ్లు వచ్చేది ఎన్నికల ప్రచారం కోసం కాదు. సినిమా షూటింగ్‌ కోసం.

పుష్ప–2 షెడ్యూల్‌..
సుకుమార్‌ దర్శకత్వంలో పుష్ప–2 తెరకెక్కుతోంది. ఇందులో హీరోగా అల్లు అర్జున్‌ నటిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రారంభం కాబోతోంది. దీనికోసం బన్నీ సోమవారం(మార్చి 11న) వైజాగ్‌ చేరుకున్నాడు. ఎయిర్‌ పోర్టులో బన్నీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇక అల్లు అర్జున్‌ షూటింగ్‌ కోసం దాదాపు రెండు వారాలు విశాఖలోనే ఉంటారని తెలుస్తోంది. పుష్ప–2కు సంబంధించిన కీలకమైన షెడ్యూల్‌ను ఇక్కడ పూర్తి చేయనున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో ఫహాద్‌ ఫాజిల్‌ కూడా జాయిన్‌ అవుతాడని తెలుస్తోంది.

రామ్‌ చరణ్‌ కూడా..
ఇక రేపో మాపో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కూడా విశాఖకు రాబోతున్నారు. శంకర్‌ దర్శకత్వంలో కొన్నేళ్లుగా గేమ్‌ ఛేంజర్‌ సినిమా చేస్తున్నాడు చర్రీ. ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సన్నివేశాలను వైజాగ్‌లో చిత్రీకరించనున్నారు. ఈమేరకు షెడ్యూల్‌ సిద్ధం చేశారు. ఈ నెలాఖరు వరకు జరుగనున్న ఈ షెడ్యూల్‌లో రామ్‌చరణ్‌తోపాటు కీలక నటీనటులు పాల్గొంటారని తెలుస్తోంది. అప్పటి వరకు చరణ్‌ ఇక్కడే ఉంటారని సమాచారం.

ఫ్యాన్స్‌కు పండగే..
ఇద్దరు మెగా హీరులో ఒకే నెలలో విశాఖలో సందరడి చేయబోతున్నారు. ఒకటి రెండు రోజులు కాదు కనీసం పది రోజులు ఇక్కడే ఉండబోతున్నారు. ఈ విషయం తెలియడంతో ఇద్దరి ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీగా ఫీల్‌ అవుతున్నారు. పది రోజుల్లో ఏదో ఒకరోజు తమ అభిమాన హీరోను కలిసేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version