కరోనా వైరస్ బాధితుల సహాయార్థం తెలుగు సినిమా రంగ ప్రముఖులు ఒక్కొక్కరుగా భారీ విరాళాలు ప్రాతిస్తున్నారు. హీరో నితిన్ తో మొదలైన ఆర్థిక సాయం ఇప్పుడు ఊపందుకుంది. పవన్ కళ్యాణ్ ఇచ్చిన రెండు కోట్ల తో మొదలైన ఈ వితరణ మెగా ఫామిలీ లో మరింత మందికి స్ఫూర్తి అయ్యింది ఆ ఇంటి నుంచి ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ , సాయి ధరమ్ తేజ్ విడివిడిగా ఒక కోటి ,70 లక్షలు , 10 లక్షలు ఇచ్చి తమ దానగుణం చాటు కొన్నారు ఇపుడు తాజాగా అల్లు అర్జున్ కూడా వాళ్ళ సరసన చేరాడు. బన్నీ తన వంతుగా 1 కోటి ౨౫ లక్షలు విరాళం ప్రకటించాడు. దీనిలో 50 లక్షలు చొప్పున రెండు తెలుగు రాష్ట్రాలకు ఇస్తుండగా మిగతా 25లక్షలు కేరళ రాష్ట్రానికి ఇవ్వ నిశ్చయించాడు .
ఇక ఇదే క్రమంలో మరో దర్శకుడు సుకుమార్ కూడా ముందుకు వచ్చి 10. లక్షలు విరాళం ప్రకటించడం జరిగింది . ఇక బన్నీ , సుకుమార్ కలయిక లో సినిమా నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు కూడా
రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 10 లక్షలు చొప్పున విరాళం ప్రకటించడం జరిగింది .