Homeఎంటర్టైన్మెంట్'ఎన్టీఆర్, చరణ్'లతో పోటీకే బన్నీ ఆరాటం !

‘ఎన్టీఆర్, చరణ్’లతో పోటీకే బన్నీ ఆరాటం !

Pushpa RRRఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ పేరు మార్చుకున్నాక.. ఎప్పుడూ ఒక రకమైన ట్రాన్స్ లోనే ఉండిపోతున్నాడట. మాట్లాడితే మనది పాన్ ఇండియా రేంజ్ అంటున్నాడట. నిజమే, పాన్ ఇండియా లెవెల్ లోనే పుష్ప సినిమాని చేస్తోన్నాడు. బడ్జెట్ కూడా ఆ రేంజ్ లోనే ఖర్చు పెడుతున్నాడు. కానీ, ఒక సినిమా చేసినంత మాత్రాన పాన్ ఇండియా స్టార్ అయిపోతాడా ?

ఏమిటో బన్నీ. ఎన్టీఆర్, చరణ్ తో పోటీ పడే బన్నీకి ఇప్పుడు అర్జెంట్ గా పాన్ ఇండియా స్టార్ అని పిలించుకోవాలని ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ -చరణ్ పాన్ ఇండియా స్టార్స్ అయిపోతున్నారు కాబట్టి. అందుకే పుష్ప సినిమా షూటింగ్ ను శరవేగంగా చేస్తున్నాడు. కేవలం ఎన్టీఆర్, చరణ్ ల సరసన సమానంగా నిలబడాలన్నదే బన్నీ ఆరాటం.

అయితే, పుష్పను రెండు భాగాల్లో విడుదల చేయాలని ఇప్పటికే మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మొదటి భాగం షూటింగ్ చివరి దశకు కూడా చేరుకుంది. అందుకే ఎట్టిపరిస్థితుల్లో పుష్ప ఫస్ట్ పార్ట్ ను ఈ ఏడాదే పాన్ ఇండియా లెవల్లో భారీగా విడుదల చేయాలని బన్నీ ఆశ పడుతున్నాడు. కానీ ఈ ఆశ పై నీళ్లు చల్లేలా బిహేవ్ చేశారు పుష్ప నిర్మాతలు.

ఈ ఏడాది భారీ సినిమాలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి పుష్పను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు ఫిక్స్ అయిపోయారు. ఈ విషయంలోనే బన్నీ ఇగో హర్ట్ అయింది. దాంతో పుష్ప పార్ట్ 1 పూర్తైన తర్వాత, కొన్ని రోజులు బ్రేక్ తీసుకుని వెంటనే ‘ఐకాన్’ సినిమాని మొదలుపెట్టాలని బన్నీ ఇప్పటికే షెడ్యూల్స్ కూడా రెడీ చేసుకున్నాడు.

కనీసం ఐకాన్ సినిమాని అయినా ఈ ఏడాది గ్రాండ్ గా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలనేది బన్నీ ఆలోచన. కాకపోతే మైత్రి మూవీ మేకర్స్ మాత్రం ఎలాంటి బ్రేక్ లేకుండా పుష్ప పార్ట్ 2 కూడా పూర్తి చేయాలని భావిస్తోంది. బ్రేక్ లేకుండా పూర్తి చేస్తే మైత్రికి ఫైనాన్షియల్ గా భారం తగ్గుతుంది.

అలాగే బిజినెస్ కి కూడా బాగా టైమ్ ఉంటుంది కాబట్టి.. చాల ప్లాన్డ్ గా మార్కెట్ ను ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే బన్నీ తన నిర్ణయాన్ని మార్చుకునేలా లేడు. ఎలాగైనా ఈ ఏడాది తన నుండి పాన్ ఇండియా సినిమా రావాలని బన్నీ ఫిక్స్ అయిపోయాడు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version