Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ముగిసిన అధ్యాయం అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పటికీ ఈ అంశం పై కోర్టు విచారణ చేపడుతూనే ఉంది. రీసెంట్ గానే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని నాంపల్లి హై కోర్టులో విచారణకు రావాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆయన ముంబై లో షూటింగ్ లో బిజీ గా ఉండడం వల్ల ప్రత్యక్షంగా రాలేకపోయారు , వీడియో కాల్ ద్వారా అద్బుబాటులోకి వచ్చారు. గత వాయిదా లో వ్యక్తిగత హాజరు నుండి అల్లు అర్జున్ మినహాయింపు కోరారు, అందుకు కోర్టు ఆయన్ని వర్చువల్ గా హాజరు అయ్యేందుకు అనుమతి ఇవ్వగా, నేడు ఆయన విచారణలో పాల్గొన్నారు. ఈ కేసులో అల్లు అర్జున్ ని A11 ముద్దాయిగా కోర్టు గుర్తించగా, ఆయనతో పాటు మరో 23 మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చింది.
కోర్టు విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిందితులందరికీ దాదాపుగా 500 పేజీలతో కూడిన ఛార్జ్ చీట్ కాపీలను అధికారికంగా అందజేశారు. ఛార్జ్ షీట్ పంపిణీ అనంతరం న్యాయ స్థానం కేసు తదుపరి విచారణ ను ఈ నెల 29 కి వాయిదా వేశారు. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందా అని ఇప్పుడు అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ ఘటన లో రేవతి అనే మహిళా చనిపోవడం , ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికీ పూర్తి స్థాయిలో కోలుకోకపోవడం , అతని తండ్రి ప్రతీ నెల చికిత్స కి లక్షల రూపాయిలు ఖర్చు చేయడం వంటివి తీవ్రమైన మనస్తాపానికి గురి చేసే విషయం. కానీ అల్లు అర్జున్ కుటుంబం వీళ్ళని మర్చిపోలేదు , ఇప్పటికీ ఆ కుటుంబానికి అండగా నిలిచే ఉన్నారు. అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటూనే ఉన్నారు. భవిష్యత్తులో శ్రీతేజ్ మామూలు అవ్వాలని ప్రార్థిద్దాం.
ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం ‘రాకా’ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నారు. ప్రస్తుతానికి ముంబై లోనే ఈ సినిమా షూటింగ్ నడుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, థీమ్ మ్యూజిక్ కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ చిత్రం లో దీపికా పదుకొనే , జాన్వీ కపూర్ , మృణాల్ ఠాకూర్ వంటి వారు హీరోయిన్స్ గా నటిస్తుండగా, రష్మిక మందాన విలన్ గా నటిస్తోంది.
